తెలంగాణలో శుక్రవారం (జూన్ 7) నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. వరంగల్లో ప్రశ్న పత్రాలు గల్లంతైన సంగతి తెలిసిందే. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్లో భద్రపరిచిన 13 సీల్డు బాక్సుల్లో.. రెండు బాక్సులు మాయమయ్యాయి. ప్రశ్నపత్రాలు మాయమైన రెండ్రోలకు గాని విషయం వెలుగులోకి రాలేదు. పోలీసులు ప్రశ్నపత్రాలున్న బాక్సుల కోసం గత రెండ్రోజులుగా గాలిస్తునే ఉన్నారు. అయితే ఈ విషయంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ బుధవారం (జూన్ 5) స్పందించారు. మాయమైన ఆ రెండురోజుల ప్రశ్నపత్రాల స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త సెట్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
పరీక్షల షెడ్యూలు ఇలా..
షెడ్యూలు ప్రకారం జూన్ 7 నుంచి 14 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 857 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షల పూర్తి టైమ్టేబుల్ ఇలా.. సప్లిమెంటరీ పరీక్షలకు 4.63 లక్షల మంది
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,63,236 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,00,847 మంది, ద్వితీయ సంవత్సరం 1,62,389 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు 1,48,463 మంది ఉండగా.. ఫెయిలైనవారు 1,52,384 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
షెడ్యూలు ప్రకారం జూన్ 7 నుంచి 14 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 857 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షల పూర్తి టైమ్టేబుల్ ఇలా..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,63,236 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,00,847 మంది, ద్వితీయ సంవత్సరం 1,62,389 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు 1,48,463 మంది ఉండగా.. ఫెయిలైనవారు 1,52,384 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.