తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి, లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ను వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. జూన్ మొదటి వారంలో పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే.. ప్రాక్టికల్ పరీక్షలకు నిర్వహించే 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. దీంతో ఈ నెల 29 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్ నిలిచిపోయాయి. వాస్తవానికి ఏప్రిల్ 7 నుంచి పరీక్షలు జరుగాల్సి ఉండగా.. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మే 29 – జూన్ 7వ తేదీ వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ప్రాక్టికల్స్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక.. కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్ లోకి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అయితే.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రం ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహించి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటానని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇక.. కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్ లోకి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అయితే.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రం ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహించి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటానని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.