యాప్నగరం

TS Panchayat Secretary: ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష.. 84 శాతం హాజరు..

పరీక్ష నిర్వహణ కోసం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,288 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 5,62,424 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

Samayam Telugu 12 Oct 2018, 9:20 am
పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష బుధవారం (అక్టోబరు 10) ప్రశాంతంగా సాగిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,288 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 84 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 9,555 పోస్టులకు 5,62,495 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఉదయం నిర్వహించిన పేపర్‌-1 పరీక్షకు 4,77,637(84.91శాతం) మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 4,75,012(84.45శాతం) మంది హాజరయ్యారని ఆయన తెలిపారు.
Samayam Telugu exams


కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 93.03 శాతం మంది, రంగారెడ్డి జిల్లాలో అతి తక్కువగా 73.30 శాతం హాజరయ్యారు. సమాధాన పత్రాల మూల్యాంకనం అనంతరం మార్కుల ఆధారంగా అభ్యర్ధుల మెరిట్‌ జాబితా తయారవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.