యాప్నగరం

‘సమగ్ర శిక్షా అభియాన్‌’ ఉద్యోగ పరీక్షల షెడ్యూలు వెల్లడి

తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి 'సమగ్ర శిక్ష అభియాన్‌'లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 20 నుంచి 26 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షల షెడ్యూలను పాఠశాల విద్యాశాఖ డిసెంబరు 12న విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23, 24 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.

Samayam Telugu 13 Dec 2019, 12:59 am
తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి 'సమగ్ర శిక్ష అభియాన్‌'లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 20 నుంచి 26 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షల షెడ్యూలను పాఠశాల విద్యాశాఖ డిసెంబరు 12న విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23, 24 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
Samayam Telugu telangana school education dept has released ssa examination schedule for recruitment of various posts check dates here
‘సమగ్ర శిక్షా అభియాన్‌’ ఉద్యోగ పరీక్షల షెడ్యూలు వెల్లడి


➤ ఏ పరీక్ష ఎప్పుడంటే?

* డిసెంబరు 23న మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌(ఎంఐఎస్‌) కోఆర్డినేట‌ర్‌, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేష‌న్ రిసోర్స్ ప‌ర్సన్‌ (ఐఈఆర్‌పీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.


➤ అదేవిధంగా డిసెంబరు 24న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్, సిస్టమ్‌ అనలిస్ట్ పోస్టులకు రాతపరీ నిర్వహించనున్నారు.


➤ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు.


➤ మొదటి రోజు రెండు సెషన్లలో, రెండో రోజు ఒకే సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.


Dont Miss: యూకే వీసా కొత్త రూల్స్.. విదేశీ విద్యార్థులకు సువర్ణావకాశం

➤ పరీక్ష కేంద్రాలివే..

ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే పరీక్షల కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

వెబ్‌సైట్


Read Also: NTPC 'స్టేజ్-1' షెడ్యూలు ఇదేనా?

పోస్టుల వివ‌రాలు . .

* మొత్తం ఖాళీలు: 704


ఎంఐఎస్ కోఆర్డినేట‌ర్‌ - 144


➦ సిస్టమ్ అన‌లిస్ట్‌ - 12


➦ అసిస్టెంట్ ప్రోగ్రామ‌ర్‌ - 27


➦ డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌ - 138


➦ ఎడ్యుకేష‌న్ రిసోర్స్ ప‌ర్సన్‌ - 383



Read Also: సదరన్ రైల్వేలో 3,585 అప్రెంటిస్ పోస్టులు


➤ రాతపరీక్ష విధానం..

మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాలు (పార్ట్-1, పార్ట్-2) ఉంటాయి. ఒక్కో విభాగానికి 50

మార్కులు కేటాయించారు.


ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఉంటుంది.


పరీక్ష సమయం 150 నిమిషాలు (2 గం. 30 నిమిషాలు).


ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లకు మాత్రం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 160 ప్రశ్నలు అడుగుతారు.


Exam Pattern, Syllabus



ముఖ్యమైన తేదీలు . . .


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.11.2019.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 26.11.2019


రాతపరీక్ష: డిసెంబరు 23, 24 తేదీల్లో



SSA Notification



Website



Read More . . .



మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.