యాప్నగరం

SSC 10th Supply Results:నేడు తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

జూన్ 4 నుంచి 19 వరకు తెలంగాణలో జరిగిన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ పరీక్షలకు లక్షకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.

Samayam Telugu 7 Jul 2018, 4:11 pm
తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. జూన్ 4 నుంచి 19 వరకు తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,03,528 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 451 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను శనివారం నాడు అధికారులు వెల్లడించనున్నారు. ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి రెగ్యులర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11,103 పాఠశాలల నుంచి 5,38,867 మంది విద్యార్థులు హాజరుకాగా.. 83.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలు ముందువరుసలో నిలిచారు పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. బాలికలు 85.14 శాతం, బాలురు 82.46 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Samayam Telugu పదో తరగతి ఫలితాలు


ఫలితాల్లో జగిత్యాల జిల్లా తొలిస్థానంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు వరసగా 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలు 96.18 శాతం ఉత్తీర్ణతతో అత్యున్నత ఫలితాలు సాధించాయి. ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలు 5వ స్థానంలో నిలవడం గమనార్హం.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.