తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఆదివారం (జులై 14న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ జులై 14న ఫలితాలను వెల్లడించారు. అయితే కేవలం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను మాత్రమే విడుదల చేసినట్లు.. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. జులై 15లోపు ఇంటర్ సర్టిఫికేట్లను సమర్పించాలన్న షరతుపై తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జులై 13న ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు మొదటి నిర్ణయించినప్పటికీ.. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనల మేరకు జేఎన్టీయూహెచ్ నిపుణుల పర్యవేక్షణలో ఫలితాలను మరోసారి తనిఖీ చేయించి 14న విడుదల చేశారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి.. Related Article: కేటీఆర్ ట్వీట్.. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడో తెలిసిందోచ్!
ఫలితాల కోసం క్లిక్ చేయండి..