TS TET Results 2022: తెలంగాణ టెట్ 2022 ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://tstet.cgg.gov.in/ వెబ్సైట్లో తెలంగాణ TET ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి టెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో TS TET 2022 పరీక్ష జూన్ 12న ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అలాగే.. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సారి టెట్ పేపర్ 1కు బీఈడీ చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొనడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. టెట్ వ్యాలిడిటీ ఈ సారి జీవితాంతం ఉండేలా నోటిఫికేషన్లో కూడా పేర్కొన్నారు.
ఇక టెట్ ఫలితాల (TS TET Results 2022) విషయానికి వస్తే.. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి టెట్ పేపర్ 1 కు 3,18,444 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అంటే 32.68 శాతం మంది టెట్ పేపర్ 1లో క్వాలిఫై అయ్యారు.
టెట్ పేపర్ 2 విషయానికి వస్తే.. మొత్తం 2,50,897 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,24,535 మంది అర్హత సాధించారు. అంటే 49.64 శాతం మంది ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పొందారు. పేపర్ 1 క్వాలిఫై అయిన వారు ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరోవైపు టెట్ పరీక్షలో చాలా తక్కువ శాతం అర్హత సాధించడంతో.. అర్హత సాధించని వారికి మరో అవకాశం కల్పించాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయి. పేపర్ -1కు చాలా తక్కువ మంది క్వాలిఫై కావడం, అంతే కాకుండా ఆరునెలలకు ఒకసారి వెలువడాల్సిన టెట్ నోటిఫికేషన్ ఐదేళ్లకు వెలువడటంతో తాము ఎంతో నష్టపోయామని వాపోతున్నారు. దీంతో మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో TS TET 2022 పరీక్ష జూన్ 12న ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అలాగే.. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సారి టెట్ పేపర్ 1కు బీఈడీ చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొనడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. టెట్ వ్యాలిడిటీ ఈ సారి జీవితాంతం ఉండేలా నోటిఫికేషన్లో కూడా పేర్కొన్నారు.
ఇక టెట్ ఫలితాల (TS TET Results 2022) విషయానికి వస్తే.. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి టెట్ పేపర్ 1 కు 3,18,444 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అంటే 32.68 శాతం మంది టెట్ పేపర్ 1లో క్వాలిఫై అయ్యారు.
టెట్ పేపర్ 2 విషయానికి వస్తే.. మొత్తం 2,50,897 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,24,535 మంది అర్హత సాధించారు. అంటే 49.64 శాతం మంది ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పొందారు. పేపర్ 1 క్వాలిఫై అయిన వారు ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరోవైపు టెట్ పరీక్షలో చాలా తక్కువ శాతం అర్హత సాధించడంతో.. అర్హత సాధించని వారికి మరో అవకాశం కల్పించాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయి. పేపర్ -1కు చాలా తక్కువ మంది క్వాలిఫై కావడం, అంతే కాకుండా ఆరునెలలకు ఒకసారి వెలువడాల్సిన టెట్ నోటిఫికేషన్ ఐదేళ్లకు వెలువడటంతో తాము ఎంతో నష్టపోయామని వాపోతున్నారు. దీంతో మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాల్సి ఉంది.