యాప్నగరం

రేపటి నుంచి టీఎస్ ఎంసెట్: హాల్‌టికెట్స్ ఆఖరు తేదీ నేడు

తెలంగాణ ఎంసెట్ 2018 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్‌టీయూ-హెచ్ ఆధ్వర్యంలో 87 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు.

Samayam Telugu 1 May 2018, 10:18 am
తెలంగాణ ఎంసెట్ 2018 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్‌టీయూ-హెచ్ ఆధ్వర్యంలో 87 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. హాల్ టికెట్ల డౌన్లోడ్‌కు మంగళవారమే (మే 1) ఆఖరు తేదీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ జోన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 2,21,064 మంది పరీక్షలు రాయనున్నారు.
Samayam Telugu 1aaaaa


తెలంగాణలోని హైదరాబాద్‌లో ఐదు జోన్లతో పాటు వరంగల్, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కోదాడ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

మే 2, 3 తేదీల్లో వ్యవసాయ, వైద్య విద్య అభ్యర్థులు 75 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. మే 4, 5, 7 తేదీల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులు 83 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

హాల్ టికెట్ల డౌన్లోడ్‌కు ఈ రోజే ఆఖరు తేదీ: ఎంసెట్ అభ్యర్థుల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోడానికి ఈ రోజే (మంగళవారం) ఆఖరు తేదీ. పరీక్ష కేంద్రాలను కూడా ఈ రోజే తెలుసుకుని, ఆలస్యం లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. http://eamcet.tsche.ac.in

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.