యాప్నగరం

Tencent: బ్యాడ్‌ న్యూస్‌.. 5,500 మంది ఉద్యోగుల‌ను తీసేసిన ప్రముఖ సంస్థ.. కారణం ఇదే..!

Tencent fires 5,500 workers: గ‌త క్వార్ట‌ర్‌లో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలమైనందుకు టెన్సెంట్ దాదాపు 5,500 మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 19 Aug 2022, 10:16 am
Tencent Fires Nearly 5500 Employees: ప్రముఖ టెక్నాల‌జీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ దిగ్గజం టెన్సెంట్ గత పదేళ్లలో తొలిసారిగా లేఆఫ్‌ల‌ను ప్ర‌క‌టించింది. త్రైమాసిక రాబ‌డి అంచ‌నాలు అందుకోలేక‌పోయిన త‌ర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. గ‌త క్వార్ట‌ర్‌లో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలమైనందుకు టెన్సెంట్ దాదాపు 5,500 మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. జూన్ చివరి నాటికి కంపెనీలో 1,10,715 మంది ఉద్యోగులు ఉన్నారు.
Samayam Telugu Tencent Fires 5500 Employees


ఫలితాలు మెరుగుకాకపోతే.. ఇంటికే- ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే ప్రథమ కర్తవ్యం:
కేవలం టెన్సెంట్‌ మాత్రమే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే.. చైనా అతిపెద్ద టెక్నాలజీ కార్పొరేషన్ కూడా ఖర్చు తగ్గింపు చర్యగా ఒక దశాబ్దంలో మొదటిసారిగా నియామకాలను నిలిపివేసింది. ప్రస్తుతం గూగుల్‌తో సహా కొన్ని ఇతర టాప్ టెక్ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా అనేక మంది ఉద్యోగులను తొలగించాయి. మరో చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా ఇటీవల ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది.

Hyderabad ECIL లో ఉద్యోగాలు.. బీటెక్‌ పాసైన వాళ్లు అర్హులు.. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. రూ.55,000 వరకూ జీతం
ECIL Hyderabad Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL Hyderabad).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల పనిచేయుటకు.. 51 ప్రాజెక్ట్ ఇంజనీర్ (Project Engineer) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పూర్తి వివరాలకు, ఇంటర్వ్యూ తేదీల కోసం క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.