యాప్నగరం

TS: ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ తేదీలపై నేడు స్పష్టత..!

నేడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ప్రవేశ పరీక్షల తేదీలపై స్పష్టత రానుంది.

Samayam Telugu 10 Aug 2020, 8:33 am
వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్‌) నిర్వహించేందుకు టీఎస్‌ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్‌‌ ఒకటి నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికే షెడ్యూలును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యా మండలి ప్రణాళిక రూపొందిస్తోంది.
Samayam Telugu టీఎస్‌ ప్రవేశ పరీక్షలు


ఇందులో భాగంగా నేడు (ఆగస్టు10) తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే గతంలో మాదిరిగా వరుసగా ప్రవేశ పరీక్షల నిర్వహణ ఈసారి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీంతో పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ అయాన్‌‌ ఖాళీ స్లాట్స్‌ను బట్టి పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.

నేటి సమావేశంలో స్పష్టత:
సాధారణంగా ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన తరువాత విద్యార్థులు సన్నద్ధమవ్వడానికి కనీసం 10 నుంచి 15 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 వరకు పరీక్షల నిర్వహణ కష్టమే. వీలైతే ఈ నెల 24 నుంచి ఉండే స్లాట్స్‌లో ఎంసెట్‌ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది.

ఒకవేళ కుదరకపోతే వచ్చే నెలలోనే ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించే అవకాశముంది. మరోవైపు ఈ నెల 24 నుంచి 31 వరకు ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్‌ వంటి వాటిల్లో ఒకటీ రెండు పరీక్షలను నిర్వహించి వచ్చే నెల 6వ తేదీ తరువాత టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి మిగతా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ విషయాలపై నేడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో స్పష్టత రానుంది.

Also read: JAM 2021 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..!

Also read: ఆన్‌లైన్‌ క్లాసుల కోసం విద్యార్థులకు యూనివర్సిటీ ఆర్థిక సాయం.. వివరాలు ఈ కథనంలో చూడండి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.