యాప్నగరం

TS: త్వరలో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్

ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది.

Samayam Telugu 7 Aug 2020, 4:25 pm
కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షలను నిర్వహించడానికి ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ఎంసెట్‌తోపాటు పాలీసెట్‌, పీజీ ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈ సెట్‌ను జూలైలో నిర్వహించాల్సి ఉండగా వాయిదాపడ్డ విషయం తెలిసిందే. వీటిపై తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
Samayam Telugu టీఎస్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్


గతంలో ఎంసెట్‌ను నాలుగు రోజుల్లో నిర్వహించాలని నిర్ణయించగా.. ఈసారి 6 రోజులకు పెంచాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అన్ని సెట్ల తేదీలను ఖరారు చేసేందుకు అధికారులు శుక్రవారం సమావేశం కానున్నారు. ఇందులో ఆన్‌లైన్‌ పరీక్షలకు సాంకేతిక సహకారం అందించే టీసీఎస్‌ అయాన్‌ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు.

ముఖ్యంగా టీసీఎస్ అయాన్‌‌ సూచించే తేదీల్లోనే పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే ఈ పరీక్షలకు సాంకేతిక సహకారం అందించే సంస్థ టీసీఎస్‌ అయాన్‌. ఇది తెలంగాణతో పాటు ఏపీలో జరిగే పరీక్షలకు కూడా సాంకేతిక సహకారం అందిస్తోంది. దీంతో తేదీల్లో క్లాష్ రాకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Also read: IBPS PO 2020: మరో 250 పీవో పోస్టులను పెంచిన ఐబీపీఎస్‌.. మొత్తం పోస్టులు 1417

Also read: విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చు.. భారీ పుస్తకాలు అవసరం లేదు: ప్రధాని మోదీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.