యాప్నగరం

గ్రూప్-2 పరీక్షల్లో ఆధార్, అక్రమాలకు చెక్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలకు ఆధార్ తప్పనిసరి చేసింది. పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండేందుకు

Samayam Telugu 4 Nov 2016, 10:55 am
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలకు ఆధార్ తప్పనిసరి చేసింది. పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, ఫైలట్ (ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయడం) విధానాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం హాల్ టిక్కెట్లలో ఆధార్ సంఖ్య తప్పనిసరి చేసింది. దీనిద్వారా పరీక్ష జరిగే రోజు ఒక్క అభ్యర్థికి బదులు వేరే వ్యక్తులు పరీక్ష రాయకుండా నిలువరించే అవకాశంతో పాటు..అక్రమాలకు పాల్పడే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలవవుతుంది.
Samayam Telugu ts govt mandates aadhar for group 2 candidates
గ్రూప్-2 పరీక్షల్లో ఆధార్, అక్రమాలకు చెక్


బయోమెట్రిక్ పద్ధతిలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల దగ్గర నుంచి వేలి ముద్రలు సేకరిస్తారు. పరీక్ష హాలుకు హాజరయ్యే తప్పనిసరిగా బయోమెట్రిక్ లో వేలిముద్ర వేయాలి దీనిద్వారా అటెండెన్స్ పడటమేగాకుండా..ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలోనే అభ్యర్థులు తమ ఆధార్ సంఖ్యను దరఖాస్తులపై వేశారు.
ఈ నేపథ్యంలో ఆధార్ నెంబర్, వేలిముద్రలు నమోదవుతాయి...

ఈనెల 11, 13 తేదీల్లో జరుగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసింది. 2వేల పరీక్షా కేంద్రాల్లో 2500 బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ వైబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడానికి పలు విశ్వవిద్యాలయాల అధ్యాపకులతో కూడిన 350 స్క్వాడ్ లను నియమించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.