యాప్నగరం

17 నుంచి ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు

ప్రాక్టికల్స్‌ లేని ఇంటర్ విద్యార్థులు రూ.460, ప్రాక్టికల్స్‌ ఉన్న విద్యార్థులు రూ.620 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

Samayam Telugu 11 Sep 2018, 9:26 am
తెలంగాణలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతోపాటు.. గతంలో ఫెయిలైన విద్యార్థులు మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు సెప్టెంబర్‌ 17 నుంచి పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ సోమవారం (సెప్టెంబరు 10) ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్‌ 24 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 4 వరకు ఫీజలు చెల్లించవచ్చని ఆయన వెల్లడించారు.
Samayam Telugu inter


ప్రాక్టికల్స్‌ లేని గ్రూపులకు చెందిన విద్యార్థులు రూ.460, ప్రాక్టికల్స్‌ ఉన్న విద్యార్థులు రూ.620 పరీక్ష ఫీజుగా చెల్లించాలని ఆయన అశోక్ తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.