యాప్నగరం

TS SET 2022: తెలంగాణ సెట్‌ నిర్వహణకు లైన్‌క్లియర్‌.. త్వరలో నోటిఫికేషన్‌..!

Osmania University: వర్సిటీలు, కాలేజీల్లో అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో టీఎస్‌సెట్‌ కీలకం కానుంది. చివరిసారిగా 2019లో ఈ పరీక్ష జరుగగా..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 19 Oct 2022, 1:46 pm
TS SET 2022 Notification: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TS CET)ను ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నిర్వహించనుంది. ఈ మేరకు ఓయూను నోడల్‌ ఏజెన్సీగా యూజీసీ (UGC) ఎంపిక చేసింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో లెక్చరర్‌షిప్‌ పొందాలనుకునే అభ్యర్థుల అర్హతను నిర్ధారించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. 29 సబ్జెక్టులలో ఇది జరగనుంది. సెట్‌ కన్వీనర్‌గా ఓయూ ఆచార్యుడు సి.మురళీకృష్ణ వ్యవహరించనున్నారు. వర్సిటీలు, కాలేజీల్లో అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో టీఎస్‌సెట్‌ కీలకం కానుంది. చివరిసారిగా 2019లో ఈ పరీక్ష జరగగా.. మూడేళ్లుగా పరీక్ష కోసం వేలమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
Samayam Telugu TS CET 2022 Notification


TSPSC Group 1 Prelims: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై TSPSC కీలక ప్రకటన.. ఇలా షార్ట్ లిస్ట్ చేస్తారట..!

TSLPRB Results 2022: తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ కటాఫ్‌ మార్కులు సవరించిన ప్రభుత్వం.. సామాజిక వర్గాల వారీగా కటాఫ్‌ మార్కులివే..!
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB) నిర్వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను సవరిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు తెలిపింది. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం ఉండగా.. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌ విచారణలో ఉండగానే ప్రభుత్వం కటాఫ్‌లను సవరించడంతో ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

డిగ్రీ పాసైన వారికి 1422 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.63,840 వరకూ జీతం.. ఇలా అప్లయ్‌ చేసుకోండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.