యాప్నగరం

TS 10th Results 2022: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.. సిద్ధిపేట జిల్లా టాప్‌.. హైదరాబాద్‌ లాస్ట్‌.. ఈ సారి కూడా అమ్మాయిలదే హవా

TS 10th Results 2022 Manabadi: 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా టాప్‌గా నిలువగా.. 79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది. ఇక 3007 స్కూళ్లలో 100 శాతం సాధించగా.. 15 స్కూళ్లలో ఒక్కరూ పాస్‌ కాకపోవడం గమనార్హం.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 30 Jun 2022, 12:11 pm
Manabadi TS SSC Results 2022: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు (Telangana 10th Results) కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 23 నుంచి ఈనెల 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
Samayam Telugu TS SSC Results 2022


5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా టాప్‌గా నిలువగా.. 79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది.

ఇక 3007 స్కూళ్లలో 100 శాతం సాధించగా.. 15 స్కూళ్లలో ఒక్కరూ పాస్‌ కాకపోవడం గమనార్హం. అలాగే.. ఈ సారి ఫలితాల్లోనూ అమ్మాయిలే హవా సాగించారు. మొత్తం ఫలితాల్లో 87.61 శాతం మంది బాలురు ఉత్తీర్ణులు కాగా.. 92.45 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు.

ఇక ఫెయిలైన వారి కోసం ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. త్వరలో సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.

2022లో పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. కరోనా కారణంగా 2022లో పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లను మాత్రమే నిర్వహించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. విద్యార్థులు ఫలితాలను (TS 10th Results 2022) https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పరీక్షలు జరగడంతో.. TS SSC Results 2022 పై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.

TS SSC Results ను ఈ వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు:

https://www.bse.telangana.gov.in/

http://www.manabadi.co.in/
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.