యాప్నగరం

TS TET Mock Test 2024 : తెలంగాణ టెట్ మాక్ టెస్ట్ లింక్‌ ఓపెన్‌.. అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేయొచ్చు

Telangana TET Exams 2024 : తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈసారి 2.8 లక్షల మంది అభ్యర్థులు అప్లయ్‌ చేసుకున్నారు. మే 20 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 26 Apr 2024, 5:47 pm
TS TET 2024 : తెలంగాణ టెట్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ టెట్ పరీక్ష కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1 కోసం 99,210 మంది.. పేపర్‌-2కు 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక తెలంగాణ టెట్ పరీక్షలు (Telangana TET Exams 2024) మే 20 నుంచి ప్రారంభమై.. జూన్ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి ఆన్ లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 15 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం జూన్‌ 12న ఫలితాలు విడుదల చేయనున్నారు.
Samayam Telugu TS TET Mock Test 2024
తెలంగాణ టెట్ మాక్ టెస్ట్


టెట్‌ పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు. అలాగే.. మరోవైపు కీలకమైన డీఎస్సీ ఉన్న నేపథ్యంలో.. టెట్ స్కోరు కీలకంగా మారింది. ఈ క్రమంలో పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాయడం ఉత్తమం. అయితే.. తెలంగాణ టెట్‌కు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్‌లో ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ టెట్ మాక్ టెస్టులు ఎలా రాయాలంటే..?

  • మొదట అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
  • హోంపేజీలో పైన కనిపించే TS TET Mock Test-2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే.. మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
  • ఇలా అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాయొచ్చు.

TS TET పరీక్ష విధానం:

ఈ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1.. 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు.. నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.