యాప్నగరం

TS TET Results 2022: తెలంగాణ టెట్‌ ఫలితాలు వాయిదా..? కారణమిదే

TS TET final key 2022: తెలంగాణ టెట్‌ ఫలితాలను ఈ నెల27న వెల్లడిస్తామని టెట్‌ నోటిఫికేషన్‌లోనే స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ దానిపై ఆదివారం రాత్రివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అంటే సోమవారం ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని అందరూ భావిస్తున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 27 Jun 2022, 8:32 am
TS TET Results 2022: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) ఫలితాలను ఈ నెల27న వెల్లడిస్తామని టెట్‌ నోటిఫికేషన్‌లోనే స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ దానిపై ఆదివారం రాత్రివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అంటే సోమవారం ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని అందరూ భావిస్తున్నారు.
Samayam Telugu TS TET Results 2022


తెలంగాణలో మార్చి 24న టెట్ నోటిఫికేషన్‌ను (TS TET-2022 Notification) విద్యాశాఖ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ (TS TET Exam) ను జూన్ 12వ తేదీన నిర్వహించారు. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరగగా.. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ను నిర్వహించిన విషయం తెలిసిందే.

అయితే.. నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఫలితాలను జూన్ 27న ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో సైతం పేర్కొన్నారు. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా జూన్‌ 27న ఫలితాలు (TS TET Results) విడుదల అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.

TS Inter Results 2022 Manabadi: నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. అధికారిక ప్రకటన చేసిన ఇంటర్‌ బోర్డు
కానీ.. నేడు (June 27) ఫలితాలు విడుదల కావడం అనుమానమేనని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఫైనల్ కీ (TS TET Final Key) విడుదల కాకపోవడమే. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాలను జూన్ 18వ తేదీ వరకు స్వీకరించారు. పేపర్-1కు సంబంధించి మొత్తం 7,930 అభ్యంతరాలు రాగా.. పేపర్ 2కు సంబంధించి మొత్తం 4,663 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే.. ఈ అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి ఫైనల్ కీని విడుదల చేయాల్సి ఉంది. అయితే ఫైనల్ కీ ఈ నెల 24న విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకు కూడా ఫైనల్ కీని విడుదల చేయలేదు అధికారులు. సాధారణంగా ఫైనల్ కీ విడుదల, ఫలితాల ప్రకటనకు మధ్య కనీసం ఒకటి లేదా రెండు రోజుల సమయం అయినా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఫైనల్ కీ విడుదల కాకపోవడంతో నేడు (June 27) ఫలితాల వెల్లడి ఉండదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఫలితాలతో పాటే తుది కీని కూడా విడుదల చేస్తారనే మరో ప్రచారం కూడా ఉండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. టెట్ ఫలితాలు, ఫైనల్ కీ విడుదలపై నేటి (June 27) మధ్యాహ్నంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పేపర్‌-1కు 3,18,506 (90.62శాతం), పేపర్‌-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత పరీక్షలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని పలువురు అభ్యర్ధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ సారి అధిక సంఖ్యలో టెట్‌ పరీక్షలో అర్హత సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు ఫలితాలను https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.