యాప్నగరం

TSLPRB Constable Results 2022: త్వరలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు.. తాజా సమాచారం ప్రకారం..

TS Police Constable Results 2022: టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను సవరిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు తెలిపింది. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 20 Oct 2022, 11:14 am
TSLPRB Results 2022: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB) నిర్వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను సవరిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు తెలిపింది. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం ఉండగా.. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌ విచారణలో ఉండగానే ప్రభుత్వం కటాఫ్‌లను సవరించడంతో ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఫలితాలను ఈ వారాంతంలో విడుదల చేసే అవకాశాలున్నాయి. అభ్యర్థులు ఫలితాలు, ఇతర వివరాల కోసం ఎప్పటికప్పుడు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Samayam Telugu TSLPRB Constable Results 2022


TSPSC Group 1 Prelims: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై TSPSC కీలక ప్రకటన.. ఇలా షార్ట్ లిస్ట్ చేస్తారట..!
తెలంగాణ గ్రూప్-1పై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 1 పోస్టులకు కటాఫ్ మార్కులు ఉండవని TSPSC ప్రకటించింది. మెయిన్స్‌కు షాట్ లిస్ట్ చేయడానికి మాత్రమే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించామని అధికారులు వెల్లడించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఆధారంగా 1:50 మధ్య అభ్యర్థులను షార్ట్ లిస్ట్ జరుగుతుందని వివరించారు. జోన్‌లలో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు జరుగుతాయని వెల్లడించారు. ఖాళీలను బట్టి ఒక్కో కేటగిరిలో ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున మెయిన్స్‌కి క్వాలిఫై చేస్తామని అధికారులు ప్రకటించారు.

TSPSC Group 1 Key 2022: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1.. బాబోయ్‌ ఇవేం ప్రశ్నలు.. సివిల్స్‌ స్థాయిలో ప్రశ్నపత్రం.. కటాఫ్‌ ఈ రేంజ్‌లో ఉండే ఛాన్స్‌..!

TSPSC గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 16న ముగిసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం అభ్యర్థుల్లో 75 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులకు గాను 3.42 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరిలో 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. ఓఎంఆర్‌ (OMR Sheet) ఇమేజింగ్‌ పూర్తయిన తరువాత ప్రాథమిక కీని విడుదల చేస్తామని.. ఇందుకు కనీసం 8 రోజుల సమయం పడుతుందని కమిషన్‌ తెలిపింది. ప్రాథమిక కీని వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు వెల్లడించింది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.