యాప్నగరం

TSPSC Group 4 Notification 2022: తెలంగాణలో 9168 గ్రూప్ 4 ఉద్యోగాలు.. సీఎస్ కీలక ఆదేశాలు.. నోటిఫికేషన్‌ విడుదల ఎప్పుడంటే..?

TSPSC Group 4 Syllabus 2022: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని మే 29వ తేదీలోపు టీఎస్‌పీఎస్సీకి అందించాలని అన్ని శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 19 May 2022, 5:43 pm
TSPSC Group 4 Notification 2022: తాజాగా తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. అందుకు అనుగుణంగా గ్రూప్-4 నోటిఫికేషన్‌పై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్ రెడ్డి, అధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu TSPSC Group 4 Notification 2022


2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని సీఎస్ తెలిపారు. గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని మే 29వ తేదీలోపు టీఎస్‌పీఎస్సీకి అందించాలని అన్ని శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు.

Vaaradhi Mobile App: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? స్టడీ మెటీరియల్‌, మాక్‌ టెస్ట్‌లో కోసం ప్రత్యేక యాప్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
జూనియర్ అసిస్టెంట్, సమాన స్థాయి పోస్టుల ఖాళీలన్నింటినీ నోటిఫికేషన్‌లో చేర్చాలని, పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు. ప్రక్రియ పూర్తికి ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని శాఖల అధిపతులు ప్రత్యేక దృష్టి సారించి పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సీఎస్‌ సూచించారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక.. గ్రూప్‌-2కు సంబంధించి 582 పోస్టులు, గ్రూప్‌-3కి సంబంధించి 1373 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ రెండింటికి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడం కంటే కూడా.. ఈ రెండు గ్రూపుల్లోని పోస్టులన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.