టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 127 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయా ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి మొదట మే 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అనంతరం రీ నోటిఫికేషన్ ద్వారా మే 20ను దరఖాస్తుకు ఆఖరు తేదీగా ఖరారు చేశారు. అయితే తాజాగా కరోనా నేపథ్యంలో దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్త వివరాల్లోకెళ్తే..
మొత్తం 127 పోస్టుల భర్తీ:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 127 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులు పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలలో ఉన్నాయి. వీటిలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.
పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 15 సీనియర్ అసిస్టెంట్, 10 జూనియర్ అసిస్టెంట్-టైపిస్టు పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో 102 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో పూర్తి వివరాలు చూడొచ్చు.
పోస్టుల సంఖ్య: 127
ముఖ్య సమాచారం:
10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు: టీఎస్పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక యూనివర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాలకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు (ఈడబ్ల్యూఎస్) అమలవుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు నేపథ్యంలో మార్చి 31న జారీ చేసిన నోటిఫికేషన్కు తాజాగా టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేసింది.
వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లోని పోస్టులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఈనెల 19 నుంచి మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. నిరుద్యోగులు ఈ విషయాలను గమనించి దరఖాస్తు చేసుకోవాలిన సూచించింది.
మొత్తం 127 పోస్టుల భర్తీ:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 127 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులు పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలలో ఉన్నాయి. వీటిలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.
పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 15 సీనియర్ అసిస్టెంట్, 10 జూనియర్ అసిస్టెంట్-టైపిస్టు పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో 102 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో పూర్తి వివరాలు చూడొచ్చు.
పోస్టుల సంఖ్య: 127
- వెటర్నరీ యూనివర్సిటీలో 15 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు
- 10 జూనియర్ అసిస్టెంట్-టైపిస్టు పోస్టులు
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో 102 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
ముఖ్య సమాచారం:
- విద్యార్హతలు: డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా ఉత్తీర్ణత/ బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణత/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుతో డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ ఇంగ్లిష్ (లోయర్ గ్రేడ్)లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- వయస్సు: 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
- పరీక్ష విధానం: ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులకు, సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (డిప్లొమా స్టాండర్డ్) 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్ పేపర్ మాత్రం ఇంగ్లిష్లోనే ఉంటుంది.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫీజు: జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు రూ.200/- , ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.80/-
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఏప్రిల్ 12, 2021
- దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: మే 31, 2021
- వెబ్సైట్: https://www.tspsc.gov.in/
10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు: టీఎస్పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక యూనివర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాలకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు (ఈడబ్ల్యూఎస్) అమలవుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు నేపథ్యంలో మార్చి 31న జారీ చేసిన నోటిఫికేషన్కు తాజాగా టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేసింది.
వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లోని పోస్టులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఈనెల 19 నుంచి మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. నిరుద్యోగులు ఈ విషయాలను గమనించి దరఖాస్తు చేసుకోవాలిన సూచించింది.