రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే ఇంటర్ సెకండియర్ పరీక్షలను వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా టైప్ రైటింగ్, షార్ట్హ్యాండ్ పరీక్షలను పోస్ట్పోన్ చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 26, 27న టైప్ రైటింగ్, జూలై 3, 4న షార్ట్హ్యాండ్ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. అయితే లాక్డౌన్ వల్ల ఈ పరీక్షలను జూలై 17, 18, 24, 25న నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్ టెస్టులు వాయిదా:
ఏపీలో ఉద్యోగులకు నిర్వహించాల్సిన శాఖాపరమైన పరీక్షలు (డిపార్ట్మెంటల్ టెస్టులు) వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. మే 31 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
ఏపీలో ఉద్యోగులకు నిర్వహించాల్సిన శాఖాపరమైన పరీక్షలు (డిపార్ట్మెంటల్ టెస్టులు) వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. మే 31 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.