యాప్నగరం

ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు తప్పనిసరి.. మిగిలిన వాళ్లకి ఇలా.. యూజీసీ నయా మార్గదర్శకాలు జారీ

వివిధ కోర్సుల ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను సెప్టెంబర్‌ ఆఖరి లోపు నిర్వహించాలని యూజీసీ నిర్ణయించింది.

Samayam Telugu 7 Jul 2020, 10:11 am
కేంద్ర మానవ వనరుల అభివ`ద్ధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కోర్సుల్లో ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్ధులకు ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను సెప్టెంబర్‌ లోపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలను జులైలో నిర్వహించాలని యూజీసీ సూచించింది.
Samayam Telugu యూజీసీ మార్గదర్శకాలు


తాజా పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ లోపు పరీక్షలు‌ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను జరపడం తప్పనిసరని పేర్కొంది. దీంతో పరీక్షల విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది.

ప్రస్తుత పరీక్షలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని హెచ్‌ఆర్డీ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ యూజీసీకి సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజీసీ కమిషన్‌ తాజాగా సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

Also read: డిగ్రీ, పీజీ పరీక్షలపై స్పష్టత.. పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

  • చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ ఆఖరిలోపు అన్ని యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహించాలి.
  • ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా రెండింటి కలయికతో పరీక్షలు నిర్వహించవచ్చు.
  • బ్యాక్‌ లాగ్‌ సబ్జెక్టులకు కూడా పరీక్షలు నిర్వహించాలి.
  • పరిస్థితుల రీత్యా సెప్టెంబర్‌లో ఏదైనా ఒక సబ్జెక్ట్‌ పరీక్షకు హాజరుకాలేని విద్యార్థులకు మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలి.
  • ఫైనల్‌ సెమిస్టర్‌ కాకుండా మిగిలిన సెమిస్టర్‌ వాళ్లకి ఇంటర్నల్‌ మార్కులు, గత సెమిస్టర్ పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకుని గ్రేడ్లు కేటాయించవచ్చు.

Also read: ఉచిత ఎంసెట్‌ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌.. పరీక్ష తేదీ, దరఖాస్తుకు చివరి తేదీలు ఇవే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.