యాప్నగరం

Rishi Sunak : ఆ ఉద్యోగమే ప్రధాని పీఠం వైపు నడిపించింది.. విద్యార్థి దశను గుర్తుచేసుకున్న రిషి సునాక్‌

Prime Minister Rishi Sunak : లండన్‌లో ఏటా నిర్వహించే దక్షిణాసియా వంటకాల ‘కర్రీ ఆస్కార్స్‌ (Curry Oscars)’ అవార్డుల వేడుకలో వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 1 Dec 2022, 11:37 am
UK PM Rishi Sunak : బ్రిటన్‌ నూతప ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) విద్యార్థి దశ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయం వెల్లడించాడు. విద్యార్థి దశలో సౌథాంప్టన్‌లోని భారతీయ రెస్టారెంటులో షిఫ్టుల వారీగా తానుచేసిన పని.. పొందిన గొప్ప శిక్షణే.. తదనంతర కాలంలో ఉన్నత పీఠం వైపు నడిపించాయని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. లండన్‌లో ఏటా నిర్వహించే దక్షిణాసియా వంటకాల ‘కర్రీ ఆస్కార్స్‌ (Curry Oscars)’ అవార్డుల వేడుకలో వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ ఆతిథ్య రంగంలోని తన అనుభవాలను పంచుకొన్నారు.
Samayam Telugu UK PM Rishi Sunak


దేశవ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించి.. ఉత్తమ వంటకాలకు అవార్డులు అందజేసే ఈ కార్యక్రమం గత 18 ఏళ్లుగా లండన్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిషి సునాక్‌ మాట్లాడుతూ.. ‘తీవ్రమైన ఒత్తిడిలో వంటవాళ్ల నుంచి వెయిటర్‌ వరకు మీరెంత కష్టపడతారో నాకు తెలుసు. ఈ అనుభవం వ్యాపారంలో నాకెంతో ఉపయోగపడింది’ అని పేర్కొన్నారు.

UFI Layoffs : క్షమించండి.. రేపటి నుంచి ఆఫీస్‌కి రావొద్దు.. అలవెన్స్‌లు సైతం ఇవ్వలేమంటూ మెసేజ్‌ పెట్టిన సంస్థ

Curry Oscars 2022 అవార్డు విజేతలు వీళ్లే:
బెస్ట్‌ సెంట్రల్‌ లండన్‌ రెస్టారెంట్‌గా ‘బెనారస్‌’ (ఇండియన్‌), బెస్ట్‌ న్యూకమర్‌గా లండన్‌లోని ‘కల్నల్‌ సాబ్‌’, ఇంగ్లాండ్‌లో బెస్ట్‌ రెస్టారెంట్‌గా లివర్‌పూల్‌లోని ‘మౌగ్లి స్ట్రీట్‌ఫుడ్‌’ నిలిచాయి. ఈ పోటీలో మరికొన్ని భారతీయ రెస్టారెంటులు సైతం అవార్డులు గెలుచుకోవడం విశేషం.

Voter ID : ఓటు లేకుంటే.. కాలేజీల్లో నో అడ్మిషన్.. ఓటు నమోదు తప్పనిసరి చేసిన ప్రభుత్వం
Maharashtra government To Make Voter Registration Mandatory For College Admission: ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ చాలా మంది యువతీ యువకులు ఓటు హక్కు పట్ట నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్య స్పూర్తి, ఓటు వ్యవస్థ లక్ష్యం రోజు రోజుకీ నీరుగారిపోతోంది. ఈ పరిస్థితిని గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 18 సంవత్సరాలు పై బడిన వారందరికీ ఓటరు నమోదును తప్పనిసరి చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అంతే కాకుండా.. వచ్చే ఏడాది జూన్ నుంచి జాతీయ విద్యావిధానం (NEP) ద్వారా రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలోని 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో కేవలం 32 లక్షల మంది మాత్రమే ముందుకొచ్చారు. దీంతో అధికారులు ఓటరు నమోదు ప్రక్రియకు, అడ్మిషన్లకు లింక్ పెట్టారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం ఓటరు నమోదును తప్పనిసరి చేశారు.

OU One Time Chance : ఎగ్జామ్స్‌ ఫెయిలైన విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన యూనివర్సిటీ.. వన్ టైం ఛాన్స్‌తో డిగ్రీ పట్టా సొంతం
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.