యాప్నగరం

UK PM Rishi Sunak : 18 ఏళ్ల వరకు మ్యాథ్స్‌ తప్పనిసరిగా చదవాల్సిందే.. కొత్త ఏడాదిలో కీలక నిర్ణయం

British PM Rishi Sunak : కొత్త సంవత్సరంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) మొదటి ప్రసంగంకు సంబంధించిన కొన్ని వివరాలు బయటకొచ్చాయి. ఈ ప్రసంగంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 5 Jan 2023, 4:10 pm
UK PM Rishi Sunak : బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) దేశంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) మొదటి ప్రసంగంకు సంబంధించిన కొన్ని వివరాలు బయటకొచ్చాయి. ఈ ప్రసంగంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూకేలో విద్యార్థులకు 18 ఏళ్లు వచ్చే వరకు గణిత బోధన తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu UK PM Rishi Sunak


జీవితంలో తాను పొందిన ప్రతీ అవకాశం విద్య వల్లనే లభించిందని.. అందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు తన ప్రసంగంలో చెప్పారు. ప్రతి చిన్నారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. సరైన ప్రణాళికతో దీనిని అందించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలతో మనం పోటీ పడలేకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదని అన్నారు.

ప్రస్తుతం 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సగం మంది యువత గణితాన్ని పాఠ్యాంశంగా ఎంచుకోవడం లేదన్నారు. మన పిల్లలకు ఇంతకుముందుతో పోలిస్తే.. భవిష్యత్తులో ఉద్యోగాలకు అనలిటికల్‌ నైపుణ్యాల అవసరం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ నైపుణ్యాలు లేకుండా వారిని బయటకు పంపించడం వారిని నిరాశకు గురి చేస్తుందని.. అందుకే 18 ఏళ్ల వయసు వరకు గణితం తప్పనిసరి అని రిషి సునాక్‌ (Rishi Sunak) అభిప్రాయపడినట్లు సమాచారం.

ఈనెల 7 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్థానిక ప్రభుత్వాలు.. ఎందుకంటే..?

Amazon : 18,000 మంది ఉద్యోగులను తీసేసిన అమెజాన్‌.. కారణం ఏమిటంటే..?
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.