యాప్నగరం

10th 12th Result 2023 : 10, 12వ తరగతి పరీక్షల్లో సత్తాచాటిన ఖైదీలు.. 95 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం..!

Uttar Pradesh : జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పది, పన్నెండవ తరగతి పరీక్షల్లో ప్రతిభను చాటారు. పదవ తరగతి పరీక్షలకు 60 మంది ఖైదీలు హాజరుకాగా అందులో 57 మంది పాసయ్యారు. అంటే 95 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 8 May 2023, 12:35 pm
Samayam Telugu 10th 12th Result 2023
10th 12th Result 2023 : ప్రస్తుతం పరీక్షలు, ఫలితాల సీజన్‌ కొనసాగుతోంది. ఇటీవల యూపీలో 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పది, పన్నెండవ తరగతి పరీక్షల్లో ప్రతిభను చాటారు. అయితే.. పదవ తరగతి పరీక్షలకు 60 మంది ఖైదీలు హాజరుకాగా అందులో 57 మంది పాసయ్యారు. అంటే 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వారు 82.4 శాతం మార్కులు సాధించినట్లు జైలు అధికారులు తెలిపారు. అలాగే 12 వ తరగతి పరీక్షలకు 64 మంది ఖైదీలు హాజరవ్వగా అందులో 45 మంది పాసయ్యారు. అంటే 70.30 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఆరుగురు ఖైదీలు ఫస్ట్ క్లాస్ మార్కులు దక్కించుకోవడం విశేషం.

బోర్ట్ పరీక్షలకు సిద్దమవుతున్న ఖైదీల కోసం వారు చదువుకునేందుకు ఏర్పాట్లు చేయడం.. అలాగే వాళ్లకి పనులు తక్కువగా అప్పగించడంతో చదువుకోవడానికి తగినంత టైమ్‌ దొరికినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు రాస్తున్న సమయంలో వారిని పనుల నుంచి మినహాయించామని తెలిపారు. జైలులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందించామని.. జైలులో లైబ్రరీ కూడా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఖైదీలను పరీక్షలు రాసేందుకు మిగతా విద్యార్థుల మాదిరి బయటకు పంపించలేదని.. ఈసారి 10 జైళ్లలో వారికోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

10వ తరగతి ఫలితాల్లో షాకింగ్‌.. 38 స్కూళ్లలో ఒక్కరూ పాస్‌ కాలేదు..!

TS Inter : కాలేజీకి వెళ్లకుండానే.. ఇంటర్మీడియట్‌ పూర్తి చేయొచ్చు.. జస్ట్‌ ఇలా చేస్తే చాలు..!
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.