యాప్నగరం

సివిల్స్‌ పరీక్షల విషయంలో ఆ ప్రతిపాదనకు వ్యతిరేకం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

కరోనా కారణంగా 2020లో సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యే తమ చివరి అవకాశాన్ని కోల్పోయిన వారికి మాత్రమే మరో అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేసింది. అదీ కూడా వయో పరిమితికి లోబడే ఉంటుందని స్పష్టం చేసింది.

Samayam Telugu 10 Feb 2021, 10:21 pm
యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకాదలచిన అభ్యర్థులకు వయసు సడలింపు ఇచ్చి.. మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కారణంగా 2020లో సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యే తమ చివరి అవకాశాన్ని కోల్పోయిన వారికి మాత్రమే మరో అవకాశాన్ని కల్పిస్తామని.. అదీ కూడా వయో పరిమితికి లోబడే ఉంటుందని స్పష్టం చేసింది.
Samayam Telugu సివిల్స్‌ పరీక్షలు


IDBI బ్యాంక్‌లో జాబ్స్‌.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
కేంద్ర ప్రభుత్వం తరఫున ఫిబ్ర‌వ‌రి 9న‌ విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు ప్రభుత్వ అభిప్రాయాన్ని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. అదనపు అవకాశాన్ని కల్పించే ఉద్దేశం తొలుత ప్రభుత్వానికి లేదని.. అయితే కోర్టు సూచనతో అందుకు సమ్మతించిందని తెలిపారు.

వయో పరిమితిలో సడలింపు ఇవ్వడం వల్ల ఇతర అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీసినట్లు అవుతుందని పేర్కొన్నారు. 2021లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాయదలచిన వారికి వయో పరిమితిలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.