దేశంలోనే ప్రతిష్మాత్మక పరీక్షలుగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2019 నిర్వహణకు యూపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా జూన్ 2న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుంది. ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు జూన్ 2 వరకు అందుబాటులో ఉండనున్నాయి. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోని అభ్యర్థులు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్టికెట్లో ఫోటో సరిగాలేనివారు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 80 వేలమంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్టికెట్ కోసం క్లిక్ చేయండి..
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 2న రెండు సెషన్లుగా పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రంలోని అభ్యర్థులను అనుమతించరు. అంటే ఉదయం 9.20 గంటల వరకు, మధ్యాహ్నం 2.20 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 896 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 39 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
రాతపరీక్ష ఎలా ఉంటుంది...?
★ ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్ పేపర్-1, జనరల్ స్టడీస్ పేపర్-2) ఉంటాయి. ప్రతీ పేపర్కు 200 మార్కులు. పేపర్-1లో 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పేపర్-2లో 80 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 1/2 మార్కులు. నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33% మేర కోత విధిస్తారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
★ పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందు వరకే అభ్యర్థులును పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి.
★ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్టికెట్ తీసుకెళ్లాలి. లేకపోతే అనుమతించరు. హాల్టికెట్తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
★ ఓఎంఆర్ షీట్ను కేవలం బ్లాక్ బాల్పాయింట్ పెన్నుతో మాత్రమే నింపాలి.
★ పరీక్ష కేంద్రంలోని మొబైల్ ఫోన్లు, పేజర్లు, ప్రోగ్రామబుల్ డివైజ్లను, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచీలు, కెమెరా, బ్లూటూత్ డివైజ్లతోపాటు మరే ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతించరు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 2న రెండు సెషన్లుగా పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రంలోని అభ్యర్థులను అనుమతించరు. అంటే ఉదయం 9.20 గంటల వరకు, మధ్యాహ్నం 2.20 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 896 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 39 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
రాతపరీక్ష ఎలా ఉంటుంది...?
★ ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్ పేపర్-1, జనరల్ స్టడీస్ పేపర్-2) ఉంటాయి. ప్రతీ పేపర్కు 200 మార్కులు. పేపర్-1లో 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పేపర్-2లో 80 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 1/2 మార్కులు. నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33% మేర కోత విధిస్తారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
★ పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందు వరకే అభ్యర్థులును పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి.
★ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్టికెట్ తీసుకెళ్లాలి. లేకపోతే అనుమతించరు. హాల్టికెట్తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
★ ఓఎంఆర్ షీట్ను కేవలం బ్లాక్ బాల్పాయింట్ పెన్నుతో మాత్రమే నింపాలి.
★ పరీక్ష కేంద్రంలోని మొబైల్ ఫోన్లు, పేజర్లు, ప్రోగ్రామబుల్ డివైజ్లను, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచీలు, కెమెరా, బ్లూటూత్ డివైజ్లతోపాటు మరే ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతించరు.