యాప్నగరం

సివిల్స్ ఇంటర్వ్యూలకు 120 మంది తెలుగు అభ్యర్థులు!

గతేడాది డిసెంబరులో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.

TNN 23 Feb 2017, 10:57 am
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2016 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలను వెల్లడించింది. గతేడాది డిసెంబరు 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 15, 445 మంది హాజరయ్యారు. వీరిలో ప్రస్తుతం 2961 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన మెయిన్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 120 మంది వరకు ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్లు అంచనా వేస్తున్నారు.
Samayam Telugu upsc released civil services main examination 2016 results
సివిల్స్ ఇంటర్వ్యూలకు 120 మంది తెలుగు అభ్యర్థులు!


మొత్తం 1097 ఉద్యోగాలకు 2961 మందిని ఇంటర్వ్యూల కోసం ఎంపికచేశారు. మార్చి 20 నుంచి వీరికి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి. వీటికి ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 120 మంది అభ్యర్థులు హాజరవుతారు. గత కొన్నేళ్లుగా సివిల్ సర్వీసెస్ రాసే తెలుగు అభ్యర్థులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిపై అవగాహన పెరగడం వల్ల ఏటా ఎంపికయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

సివిల్ సర్వీసెస్ ద్వారా ఉద్యోగానికి ఎంపికైనా కోరుకున్న కొలువు రాని ఆశావాహులు మళ్లీమళ్లీ పరీక్ష రాయడానికే మొగ్గు చూపుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు నాలుగేళ్లుగా ఏటా సగటున 60 మంది వరకు సివిల్ సర్వీసెస్‌ ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. 2017 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రాథమిక పరీక్షను జూన్ 18 న నిర్వహించనున్నారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.