యాప్నగరం

Vaaradhi Mobile App: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? స్టడీ మెటీరియల్‌, మాక్‌ టెస్ట్‌లో కోసం ప్రత్యేక యాప్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ITC Vaaradhi: పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం, మాక్‌ టెస్ట్, సిలబస్, తదితర అంశాలను విపులంగా పొందుపరిచారు. ఏ ఉద్యోగమైనా సదరు సమాచారం ఈ యాప్‌లో లభించనుంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 19 May 2022, 10:43 am
Vaaradhi Mobile App: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది వారధి సంస్థ. పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం, మాక్‌ టెస్ట్, సిలబస్, తదితర అంశాలను విపులంగా పొందుపరిచారు. ఏ ఉద్యోగమైనా సదరు సమాచారం లభించనుంది. కరీంనగర్ లో ఏర్పాటైన ఐటీ టవర్ నుంచి తొలిసారిగా ఈ పీపుల్ ఫ్రెండ్లీ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్ ను అందుబాటులో వచ్చింది.
Samayam Telugu మొబైల్‌ యాప్‌


ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో కాంపిటేటివ్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ ఐటీ కేంద్రంగా పనిచేస్తున్న" టీమ్ అప్" అనే సాఫ్ట్ వేర్ కంపెనీ నిపుణులు ఓ సరికొత్త యాప్ వారధి (Vaaradhi Mobile App) ను రూపొందించారు. ఈ యాప్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు.

TS TET 2022 Model Paper: తెలంగాణ టెట్‌ మోడల్‌ పేపర్లు ఇవే.. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
జిల్లాతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రూప్‌ 1,2 పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కరీంనగర్‌ పట్టణంలో మొట్టమొదటి సారిగా టీం–అప్‌ సంస్థ ద్వారా రూపొందించిన యాప్‌లో మాక్‌ టెస్ట్, స్టడీ మెటీరీయల్స్, పలు రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయని అన్నారు.

IBM Off Campus Drive 2022: ఐబీఎం ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌.. ఏడాదికి రూ.4.90 లక్షల వరకూ జీతం.. ఎవరు అర్హులంటే..?
యాప్‌ వినియోగం ఇలా..!
టీం–అప్‌ సంస్థ సీఈఓ ఎంకే చైతన్య మాట్లాడుతూ.. యాప్‌ సేవలను పొందడానికి ఫోన్‌ నెంబర్, ఓటీపీతో లాగిన్‌ కావాలి. ఒకవేళ ఇంతకు ముందు వారధిలో మెంబర్‌ అయినట్లయితే వారు వారధి అకౌంట్లో లాగిన్‌ అవ్వాలి. ఈ యాప్‌ను ప్లే స్టోర్‌ నుండి వారధి అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

తెలంగాణలో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు:రాష్ట్రంలో 90 వేల ఉద్యోగాలు ప్రకటించగా.. 10 వేల ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ మార్చి నెలలో ప్రకటించారు. ఇందులో భాగంగానే టీఎస్‌సీఎస్సీ గ్రూప్‌-1, పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర డిపార్ట్ మెంట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.