యాప్నగరం

'సాథి' ఉపకారం.. విద్యార్థుల చదువుకు సహకారం

SAATHI Primavera Scholarships 2019 | ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీ బాష్ ఇండియా సంస్థ తన ట్రస్ట్ ద్వారా స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఇందులో భాగంగా అర్హత కలిగిన విద్యార్థులు ప్రతి ఏటా రూ.35,000 వరకు ఉపకారవేతనం ఇవ్వనుంది

Samayam Telugu 8 Oct 2019, 8:22 pm
దేశంలోని విద్యా సంస్థల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివే విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి మెరిట్ స్కాలర్ షిప్స్ ఇవ్వనున్నారు. బాష్ ఇండియాకు చెందిన ప్రిమావెరా ఇండియా ట్రస్ట్ 'సాథీ' పేరిట స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ ట్రస్ట్ తాజాగా ఎన్‌ఎస్‌డీఎల్ ఇ-గవర్నెన్స్ విద్యాసారథి పోర్టల్‌తో జతకట్టింది. ఇంటర్, డిప్లొమా (ఫుల్‌టైమ్ ), బీఏ, బీకామ్, బీఎస్‌సీ, బీఈ, బీటెక్ కోర్సులు చదువుతున్నవారు ఈ ఉపకారవేతనం అందించనుంది. ఎంపికైన విద్యార్థులకు కోర్సును బట్టి ఏడాదికి రూ.20,000 నుంచి రూ.35,000 వరకు స్కాలర్‌షిప్ ఇస్తారు.
Samayam Telugu Vidya sarathi


ప్రిమావెరా ఇండియా ట్రస్ట్‌ను ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీ బాష్ స్థాపించింది. విద్యాసారథి అనేది ఎస్‌ఎస్‌డీఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందిస్తున్న ఒక పోర్టల్. ఎస్‌ఎస్‌డీఎల్ కార్పొరేట్ సంస్థలు అందిస్తున్న స్కాలర్‌షిప్స్‌ను నిరుపేద విద్యార్థులకు అందేలా చేస్తుంది. దీంతో వారికి ఆర్థిక సాయం లభిస్తుంది. విద్యార్థులకు విద్యాసారథి పోర్టల్ గురించి బాగా తెలిసే ఉంటుంది.

జూనియర్ కాలేజీ, గ్రాడ్యుయేషన్ చదువుతున్నవారు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్ధులకు ఇది అందుబాటులో ఉంది. కోర్సు ఫీజు ప్రాతిపదికన స్కాలర్‌షిప్ అమౌంట్ మారుతుంది. కోర్సు ఆధారంగా గరిష్టంగా ఏడాదికి రూ.35,000 పొందొచ్చు. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు అక్టోబరు 11 వరకు అవకాశం ఉంది.
Website

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.