యాప్నగరం

Dussehra Holidays 2022: స్కూళ్లకు రేపటి నుంచి దసరా సెలవులు.. ఏపీ, తెలంగాణలో Dasara సెలవుల తేదీలివే

Dussehra 2022: ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు (Dasara Holidays) ప్రభుత్వాలు ప్రకటించాయి. కాగా.. దసరా (Dasara) పండుగ అక్టోబర్‌ 5న జరుగనుంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 24 Sep 2022, 11:18 am
Dussehra Holidays 2022: తెలంగాణలోని స్కూళ్లకు ఈనెల 26 నుంచి దసరా సెలవులు (Dasara Holidays) ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు దసరా సెలవులు ఇచ్చారు. అలాగే.. ఈనెల 25న ఆదివారం, అక్టోబర్‌ 9వ తేదీ ఆదివారం కావడంతో మొత్తం 15 రోజులు సెలవులు కొనసాగనున్నాయి. అక్టోబర్‌ 10న స్కూళ్లు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్నీ జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. దసరా (Dasara) పండుగ అక్టోబర్‌ 5న జరుగనుంది.
Samayam Telugu Dussehra Holidays 2022


ఏపీలో కూడా ఈనెల 26 నుంచి అక్టోబర్‌ 6 వరకు:ఏపీలో కూడా దసరా సెలవులు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 6 వరకు ప్రకటించారు. క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు మాత్రం దసరా సెలవులు అక్టోబరు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇవ్వ‌నున్నారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో ముందుగా ద‌స‌రా సెల‌వుల గురించి ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని.. 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు. ఏపీలో ఏటా జూన్ లో మొదలయ్యే క్లాస్ లు ఈ ఏడాది జూలైలో ప్రారంభం అయ్యాయి. ఇలా 20 రోజులు వెనక్కి వెళ్లింది. 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న ముగుస్తాయి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.