యాప్నగరం

Wipro కీలక నిర్ణయం..! సగం జీతానికి పనిచేయండి.. ఫ్రెషర్లకు విప్రో షాకింగ్‌ ఈ-మెయిల్‌..!

Wipro freshers dilemma : విప్రో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2022-23 గ్రాడ్యుయేట్‌ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు గతంలో.. రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే.. అయితే.. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారిని..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 21 Feb 2023, 10:56 am
Wipro cuts freshers salary by 50 percent : అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో.. జాయినింగ్‌ ఆఫర్‌ చేసిన వార్షిక వేతన ప్యాకేజీని సగానికి పరిమితం చేస్తామంటూ ఫ్రెషర్లకు విప్రో మెయిల్‌ ద్వారా తెలియజేస్తోంది. 2022-23 గ్రాడ్యుయేట్‌ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు గతంలో.. రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారిని.. 2023 మార్చి నుంచి రోల్స్‌లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించనుంది.
Samayam Telugu Wipro cuts freshers salary


అయితే.. శాలరీ ప్యాకేజీని మాత్రం రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని.. విధుల్లో చేరాల్సిందిగా వాళ్లకు ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. మా వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఇస్తున్న ఆఫర్‌ ద్వారా అభ్యర్థులు వెంటనే వారి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడమే కాకుండా.. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు’ అని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు విప్రో తెలిపింది. ‘ప్రస్తుత ఆఫర్‌కు మీరు అంగీకరిస్తే.. ఇంతకుముందు ఇచ్చిన ఆఫర్‌ రద్దవుతుంది' అని ఫ్రెషర్లకు పంపిన ఈ-మెయిల్‌లో విప్రో పేర్కొందని తెలుస్తోంది.

TATA STEEL : ఇంజినీరింగ్‌ విద్యార్థులకు టాటా స్టీల్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ జాబ్స్‌.. ఏడాదికి రూ.6.24 లక్షల జీతం
Tata Steel Assistant Manager Recruitment 2023 : టాటా గ్రూప్‌లో ప్రతిష్ఠాత్మకమైన టాటా స్టీల్‌ సంస్థ టాటా స్టీల్‌ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌- 2023 ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 3వ తేదీలోగా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.