APOSS 10th Result 2019: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి
Andhra Pradesh Open School Results 2019 | ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
Samayam Telugu 8 Aug 2019, 3:37 pm
ప్రధానాంశాలు:
- ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
- వెబ్సైట్లో పదోతరగతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
- రీవెరిఫికేషన్కు అవకాశం
ఏపీలో ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం (ఆగస్టు 8) విడుదల చేశారు. పదోతరగతి పరీక్షలకు మొత్తం 14,676 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 9,382 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 14,077 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 7,478 మంది (53.12%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదోతరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా 88 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా కడప జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక ఇంటర్ ఫలితాల్లో 71.96 శాతంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
రీవెరిఫికేషన్కు అవకాశం..
పదోతరగతి, ఇంటర్ ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు సమాధాన పత్రాల రీవెరిఫికేషన్, డూప్లికేట్ సర్టిపికేట్లు పొందేందుకు ఏపీ ఓపెన్ స్కూల్ కమిటీ అవకాశం కల్పించింది. ఇందుకోసం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఏపీ అన్లైన్ ద్వారా పొందవచ్చు. ఆగస్టు 9 నుంచి 20 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది.
వెబ్సైట్
రీవెరిఫికేషన్కు అవకాశం..
పదోతరగతి, ఇంటర్ ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు సమాధాన పత్రాల రీవెరిఫికేషన్, డూప్లికేట్ సర్టిపికేట్లు పొందేందుకు ఏపీ ఓపెన్ స్కూల్ కమిటీ అవకాశం కల్పించింది. ఇందుకోసం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఏపీ అన్లైన్ ద్వారా పొందవచ్చు. ఆగస్టు 9 నుంచి 20 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది.
వెబ్సైట్