యాప్నగరం

AP EAMCET Results: ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్‌ చేయండి

ap eapcet results 2021 manabadi: తాజాగా విడుదలైన ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.

Samayam Telugu 14 Sep 2021, 11:43 am
ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.
Samayam Telugu ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు 2021


ఈ పరీక్షలకు మొత్తం 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు ఈ నెల 7వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా మొత్తం 5 విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాల కోసం https://sche.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. జేఎన్టీయూ కాకినాడ ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

ఇప్పటికే విడుదలైన ఇంజనీరింగ్ విభాగం ఫలితాలు:ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం ఫలితాలు ఈ నెల 8న విడుదలయ్యాయి. అంతకు ముందు రోజున అగ్రి, ఫార్మసీ విభాగాల పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఫలితాలను మరో నాలుగు రోజుల తర్వాత విడుదల చేస్తామని.. మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,66,462 మంది పరీక్షలు రాయగా.. 1,32,233 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణతా శాతం 80.62గా ఉంది. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో జరిగిన విషయం కూడా తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.