యాప్నగరం

AP: త్వరలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 19 Oct 2020, 7:50 pm
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాల్లో ఈసారి ర్యాంకులను వెల్లడించనున్నారు. ఈ 14 రకాల రాత పరీక్షలకు సంబంధించి వేర్వేరుగా అత్యధిక మార్కులు సాధించిన వారికి తొలి ర్యాంకు మొదలు చిట్టచివరి స్థానంలో మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి వరకు ఈ ర్యాంకులను వెల్లడించనున్నట్టు సమాచారం.
Samayam Telugu ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం‌


జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకుల ఆధారంగానే ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫలితాలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. అయితే.. 19 కేటగిరీలలో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 10, 57,355 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,69,034 మంది హాజరయ్యారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలకుగాను గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు గాను.. 1,10,520 పోస్టులు భర్తీ చేశారు. మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రాతపరీక్షలు నిర్వహించారు.

Must read: బీఈ/బీటెక్ వాళ్లకు‌ బెల్‌ సంస్థలో 56 జాబ్స్‌.. రాత పరీక్ష లేదు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.