ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) సవరణ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం (సెప్టెంబరు 26) విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. స్క్రీనింగ్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు.. మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను, కటాఫ్ మార్కుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
వాస్తవానికి DAO స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ సెప్టెంబరు 13నే విడుదల చేసింది. అయితే ప్రిలిమినరీ పరీక్ష తర్వాత ఏపీపీఎస్సీ విడుదల చేసిన ‘కీ' ప్రకారం.. తమకు కటాఫ్ మార్కులకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. కానీ ఫలితాలు చూస్తే మెయిన్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలో మాత్రం తమ నెంబర్లు లేవని కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు పంపారు. వీటిని పరిశీలించిన కమిషన్ సభ్యులు .. జవాబుపత్రాల మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకున్న ‘కీ' విషయంలో సాంకేతిక పొరపాటే ఫలితాల తారుమారుకు కారణమని గుర్తించిన ఏపీపీఎస్సీ.. దాన్ని సరిదిద్ది సెప్టెంబరు 26న సవరించిన ఫలితాలను విడుదల చేసింది.
Read Also: పదోతరగతి 'క్వశ్చన్ పేపర్' మారిందోచ్.. ఇక ఒకే పేపర్!
ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్ విభాగంలో మొత్తం 20 డీఏవో పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జులై 7న ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37,876 మంది అభ్యర్థులు DAO పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. 21,828 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 16,846 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
Read Also: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడి
స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ జులై 11న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఆగస్టు 9న రివైజ్డ్ కీని విడుదల చేసింది. అనంతరం సెప్టెంబరు 13న ఫలితాలతోపాటు తుది ఆన్సర్ కీని కూడా కమిషన్ విడుదల చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా మార్కుల్లో తప్పులు దొర్లడంతో మరోసారి మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రివైజ్డ్జాబితాను కమిషన్ వెల్లడించింది. ఫలితాలను కూడా అందుబాటులో ఉంచింది.
- DAO Results
- Results of qualified candidates for Mains.
- Cut off marks statement.
- List of Rejected candidates
వాస్తవానికి DAO స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ సెప్టెంబరు 13నే విడుదల చేసింది. అయితే ప్రిలిమినరీ పరీక్ష తర్వాత ఏపీపీఎస్సీ విడుదల చేసిన ‘కీ' ప్రకారం.. తమకు కటాఫ్ మార్కులకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. కానీ ఫలితాలు చూస్తే మెయిన్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలో మాత్రం తమ నెంబర్లు లేవని కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు పంపారు. వీటిని పరిశీలించిన కమిషన్ సభ్యులు .. జవాబుపత్రాల మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకున్న ‘కీ' విషయంలో సాంకేతిక పొరపాటే ఫలితాల తారుమారుకు కారణమని గుర్తించిన ఏపీపీఎస్సీ.. దాన్ని సరిదిద్ది సెప్టెంబరు 26న సవరించిన ఫలితాలను విడుదల చేసింది.
ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్ విభాగంలో మొత్తం 20 డీఏవో పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జులై 7న ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37,876 మంది అభ్యర్థులు DAO పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. 21,828 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 16,846 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
Read Also: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడి
స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ జులై 11న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఆగస్టు 9న రివైజ్డ్ కీని విడుదల చేసింది. అనంతరం సెప్టెంబరు 13న ఫలితాలతోపాటు తుది ఆన్సర్ కీని కూడా కమిషన్ విడుదల చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా మార్కుల్లో తప్పులు దొర్లడంతో మరోసారి మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రివైజ్డ్జాబితాను కమిషన్ వెల్లడించింది. ఫలితాలను కూడా అందుబాటులో ఉంచింది.