యాప్నగరం

AP SSC Results 2021: ఏపీ టెన్త్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

AP 10th Results 2021: రెండు మూడు రోజుల్లో ఏపీ 10వ తరగతి ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 28 Jul 2021, 4:45 pm
ఏపీ పదోతరగతి ఫలితాల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రెండు మూడు రోజుల్లో టెన్త్ ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా వల్ల పరీక్షలు రద్దు చేయటంతో విద్యార్థులందరూ పాస్ అయినట్లేనని మంత్రి అన్నారు.
Samayam Telugu ఏపీ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు 2021


కరోనా సెకండ్ వేవ్ వల్ల పరీక్షలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు మార్కుల లెక్కింపు.. గ్రేడ్ల కేటాయింపు చేయాల్సి వచ్చింది. ఇందులో కూడా ఫార్మేటివ్ పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఫార్మేటివ్-1, ఫార్మేటివ్-2 పరీక్షలు మాత్రమే జరిగాయి. దీంతో ఒక్కో పరీక్షకు 50 మార్కుల చొప్పున లెక్కగట్టి విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. ఇక్కడ కూడా ఎక్కువ మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల సగటును పరిగణలోకి తీసుకొని గ్రేడ్లు ఇవ్వనున్నారు.

ఇంటర్‌ పాసైన వారికి హెడ్‌ కానిస్టేబుల్‌ జాబ్స్‌.. నెలకు రూ.81,100 వరకూ జీతం
గత ఏడాదిటెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వకపోవడంతో వారికి ఇబ్బందులెదురవుతున్నాయి. భవిష్యత్తులో పదోతరగతి మార్కుల ఆధారంగా ఇచ్చే ఉద్యోగాల దరఖాస్తు చేసినప్పుడు కూడా గ్రేడ్లు, మార్కులు లేకపోవడంతో వారు నష్టపోయే పరిస్థితి రావొచ్చు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయ రతన్ నేతృత్వంలోని కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంది.

ఇక.. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ సెకండ్ ఇయర్ తో పాటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా పాసైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కు మాత్రం గ్రేడ్లు కేటాయించింది.

AP POLYCET పరీక్ష తేదీ ఖరారు:
ఏపీ పాలిసెట్ 2021 పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న పాలిసెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏపీ కూడా పలు పరీక్షల తేదీలను ఇప్పటికే ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న పాలిసెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 26 నుంచి పాలిసెట్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక రాష్ట్రంలోని 45 పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్ఓడీలు పాలిసెట్ పరీక్షకు సమన్వయ అధికారులుగా వ్యవహరించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.