యాప్నగరం

APPSC Group 1 Result 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు ఎంపికైన వారి జాబితా ఇదే

APPSC Group 1 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితంగా APPSC చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించిడం విశేషం.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 27 Jan 2023, 10:33 pm
APPSC Group 1 Result 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితంగా APPSC చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించిడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు APPSC Group 1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమనరీ పరీక్షలకు 88 వేల మంది నిరుద్యోగులు హాజరు కాగా.. 1:50 నిష్పత్తిలో ప్రిలిమనరీ ఫలితాలను APPSC ప్రకటించింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను చెక్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 23వ తేదీన APPSC Group 1 మెయిన్‌ పరీక్షను APPSC నిర్వహించనుంది.
Samayam Telugu APPSC Group 1 Result 2023


APPSC Group 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి జాబితా ఇదే

GROUP-I_Result_File_For_Main_Examination_27012023

APPSC Group 2 Notification 2023 : ఫిబ్రవరిలో APPSC Group 2 నోటిఫికేషన్‌ విడుదల..? పోస్టుల సంఖ్య, కొత్త పరీక్ష విధానం ఇదే
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 182 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. దీంతో ఇందులో డిప్యూటీ తహసీల్దార్‌–30, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2–16, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, కోపరేటివ్‌–15, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3–05, ఏఎల్‌వో (లేబర్‌)–10, ఏఎస్‌వో (లా)–02, ఏఎస్‌వో(లేజిస్లేచర్‌)–04, ఏఎస్‌వో(సాధారణ పరిపాలన)–50, జూనియర్‌ అసిస్టెంట్స్‌(సీసీఎస్‌)–05, సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)–10, జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)–20, సీనియర్‌ అడిటర్‌(స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)–05, ఆడిటర్‌ (పే అండ్‌ అలవెన్స్‌ డిపార్ట్‌మెంట్‌)–10 తదితర పోస్టులు ఉన్నాయి. త్వరలో వెలువడే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.