యాప్నగరం

CBSE 12th Result 2022: సీబీఎస్‌ఈ 12వ తగరతి ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే

CBSE Result 2022 Class 12th Declared: ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో మొత్తం 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. బాలురకంటే.. బాలికలు ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేసి సత్తా చాటారు. 33 వేల మందికి పైగా విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్ సాధించడం విశేషం.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 22 Jul 2022, 11:16 am
CBSE12th Results: ఎట్టకేలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్‌ఈ బోర్డు శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రిజల్ట్స్‌ను చెక్‌చేసుకోవచ్చు. తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్, అడ్మిట్‌ కార్డ్‌ ఐడీని ఎంటర్‌ చేసి స్కోరుకార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు డిజిలాకర్‌ , పరీక్షా సంగమ్‌ వెబ్ సైట్ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
Samayam Telugu CBSE 12th Result 2022


ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో మొత్తం 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. బాలురకంటే.. బాలికలు ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేసి సత్తా చాటారు. 33 వేల మందికి పైగా విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్ సాధించడం విశేషం. 1.34 లక్షల మంది విద్యార్థులకు 90 శాతానికి పైగా మార్కులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 21 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలకు హాజరుకాగా, మొత్తం 14 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాలను చెక్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్‌లు:
https://www.cbse.gov.in/

http://parikshasangam.cbse.gov.in/

https://cbseresults.nic.in/

కాగా టర్మ్ -1, 2 పరీక్షలు రెండింటిలోనూ వచ్చిన మార్కుల వెయిటేజీ ఆధారంగా CBSE ఫైనల్ మార్క్ షీట్ రానుంది. ఇందులో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్‌లు, ప్రాక్టికల్ పరీక్షలు అలాగే ప్రీ-బోర్డ్ ఎగ్జామ్స్‌ మార్కుల వివరాలను పొందుపరచనున్నారు.

ఈ ఏడాది బాలికలదే పైచేయి:ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12 తరగతి పరీక్షల కోసం 14, 44, 341 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొత్తం14,35,366 మంది పరీక్షలు రాయగా13, 30, 662 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 92.71గా నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.