యాప్నగరం

CUET Result 2022: ఈనెల 15న సీయూఈటీ ఫలితాలు విడుదల.. మార్కింగ్‌ స్కీమ్ ఇలా ఉంటుంది..!

CUET Result: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (CUET) ఫలితాలు సెప్టెంబర్‌ 15న విడుదల చేయనున్నట్లు యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ప్రకటించారు. దేశంలో CUET జరగడం ఇదే తొలిసారి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 13 Sep 2022, 2:41 pm
CUET Result 2022: సీయూఈటీ ఫలితాలు ఈనెల 15న విడుదలకానున్నాయి. ఇప్పటికే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆన్సర్‌ కీ విడుదలైంది. అభ్యర్థులు ఆన్స్‌ర్‌ కీ ని https://cuet.samarth.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (CUET) ఫలితాలు సెప్టెంబర్‌ 15న విడుదల చేయనున్నట్లు యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ప్రకటించారు. దేశంలో CUET జరగడం ఇదే తొలిసారి. కాగా.. జులై 14 నుంచి ఆగస్టు 30 వరకు దేశంలో 510 కి పైగా నగరాల్లో CUET పరీక్ష నిర్వహించారు. 12వ తరగతి మార్కుల కంటే స్కోర్‌ ఆధారంగానే వర్సిటీలు అడ్మిషన్లు కల్పించనున్నాయి. కనీస అర్హత మార్కులు ఎంత అనేది వర్సిటీలే నిర్ణయించనున్నాయి. అభ్యర్థులు వివరాలను https://cuet.samarth.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Samayam Telugu CUET Result 2022


మార్కింగ్ స్కీమ్ ఇలా:
అభ్యర్థి రాసిన సరైన సమాధానానికి ఐదు మార్కులు (+5) కేటాయిస్తారు. అయితే తప్పు సమాధానానికి ఒక మార్క్ మైనస్ (-1) చేయనున్నారు. అయితే ఆన్సర్ చేయకుండా వదిలివేసిన ప్రశ్నలకు ఎలాంటి మార్కులు ఇవ్వరు. ఒకవేళ ఫైనల్ రిజల్ట్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ సరైనవని తేలితే, సరైన ఆప్షన్స్‌లో దేనినైనా గుర్తించిన వారికి మాత్రమే ఐదు మార్కులు ఇస్తారు. ఒకవేళ ప్రశ్నకు ఇచ్చిన అన్ని ఆప్షన్స్ సరైనవని గుర్తిస్తే.. ప్రశ్నను ప్రయత్నించిన వారందరికీ ఐదు మార్కులు (+5) కేటాయిస్తారు. ఆప్షన్స్‌లో ఏదీ సరైనది కాకపోయినా లేదా ఏదైనా ఒక ప్రశ్న తప్పుగా వచ్చినా లేదా క్వశ్చన్‌ను డ్రాప్ చేసినా.. డ్రాప్ చేసిన ప్రశ్నను ప్రయత్నించిన అభ్యర్థులందరికీ ఐదు మార్కులు (+5) ఇవ్వనున్నారు.

క్రాస్‌ చెక్ చేసుకోవచ్చు:
సీయూఈటీ-2022 పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ కీని ఎన్‌టీఏ ఇటీవల విడుదల చేసింది. దీంతో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న రెస్పాన్స్ షీట్‌తో తాత్కాలిక ఆన్సర్ కీని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సీయూఈటీ -2022 తాత్కాలిక ఆన్సర్ కీపై విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా తుది ఆన్సర్ కీ‌ను ఎన్‌టీఏ రిలీజ్ చేయనుంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.