యాప్నగరం

TS Inter 1st year Supply Results 2022: తెలంగాణ ఇంటర్‌ 1st year సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ లింక్‌ ఇదే

tsbie.cgg.gov.in Supplementary Results 2022: తెలంగాణ ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను ఆగ‌స్టు 30వ తేదీ సాయంత్రం విడుద‌ల చేశారు. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 31 Aug 2022, 8:29 am
TS Inter Supplementary Results 2022: తెలంగాణ ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను ఆగ‌స్టు 30వ తేదీ సాయంత్రం విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌కు జ‌న‌ర‌ల్‌కు 2,20,456 మంది, వొకేషనల్‌కు 18,955 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో జ‌న‌ర‌ల్‌లో 1,49,285 (67.72శాతం)మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అలాగే వొకేషనల్‌లో 10,858 (57.28శాతం )మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఈ ఇంట‌ర్ ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. తెలంగాణ ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్షల ఫ‌లితాల‌ను https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.
Samayam Telugu TS Inter 1st year Supply Results 2022


ఇప్పటికే సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల:
తెలంగాణ ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు (ఆగస్టు 30) విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటీర జలీల్‌ మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ అడ్వాన్స్ సప్లిమంటరీ పరీక్షలకు మొత్తం 1,14,289 మంది హాజరుకాగా.. సప్లిమెంటరీ జనరల్ పాస్ పర్సంటేజ్ 47.74%గా ఉండగా ఒకేషనల్‌ 65.07% ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంటర్‌ మెయిన్‌, సప్లీలో కలిసి మొత్తం 80.80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు.

రెగ్యులర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. నేడు ఈ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.