ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కోర్సుకు సంబంధించిన వివిధ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. బీఈడీ రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం (ఆగస్టు 29) ప్రకటించారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. బీఈడీ రెండో సెమిస్టర్లో 85.82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. నాలుగో సెమిస్టర్లో 93.30 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఫలితాల కోసం క్లిక్ చేయండి..