యాప్నగరం

OU Results 2021: ఓయూ డిగ్రీ బ్యాక్‌లాగ్‌ పరీక్షా ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

osmania.ac.in: ఉస్మానియా యూనివర్సీటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సులకు (Degree Courses) సంబంధించిన బ్యాక్‌లాగ్‌ ఫలితాలను (OU Results) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

Samayam Telugu 30 Dec 2021, 10:45 am
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) తాజాగా కీలక ప్రకటన చేసింది. యూనివర్సీటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సులకు (Degree Courses) సంబంధించిన బ్యాక్‌లాగ్‌ ఫలితాలను (OU Results) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేష్ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu ఓయూ డిగ్రీ ఫలితాలు 2021


బీఏ (BA), బీబీఏ (BBA), బీఎస్సీ (BSc) తదితర కోర్సులకు సంబంధించిన 1, 3,5,6 సెమిస్టర్ల బ్యాక్ లాగ్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://www.osmania.ac.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

NMDC Recruitment: రాత పరీక్ష లేకుండా ఎన్ఎండీసీలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక
ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి:
  • మొదట యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://www.osmania.ac.in/ ను ఓపెన్ చేయాలి.
  • Examination Results ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • అనంతరం కోర్సుల వారీగా ప్రత్యేకమైన లింక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు వారికి సంబంధించిన లింక్స్ పై క్లిక్ చేయాలి.
  • అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవువుతంది. ఈ పేజీలో కనిపించే బాక్స్‌లో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్‌మిట్‌ చేయాలి.
  • ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. వీటిని ప్రింట్‌ తీసుకోవచ్చు.

ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. ఇక్కడ క్లిక్‌ చేయండి:

CBSE 10th 12th Result: త్వరలో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి టర్మ్‌-1 ఫలితాలు.. వివరాలివే
CBSE 10th 12th Result: సీబీఎస్‌ఈ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతుల టర్మ్‌-1 పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్మ్‌-1 పరీక్ష ఫలితాలపై విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సీబీఎస్ఈ టర్మ్‌-1 పరీక్షా ఫలితాలు 2022 జనవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

UPSC Jobs: 741 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత.. మంచి జీతం, ఇతర సౌకర్యాలు
10, 12వ తరగతుల టర్మ్‌-1 బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ లో విడుదలవుతాయి. సీబీఎస్‌ఈ బోర్డు ఈసారి పరీక్షలను రెండు టర్మ్‌లుగా విభజించింది. మొదటి టర్మ్‌ని అత్యంత ముఖ్యమైన పరీక్షగా పరిగణించింది. ఒకవేళ టర్మ్‌-2 పరీక్షలు రద్దయితే ఫైనల్ రిజల్ట్‌ను టర్మ్-1 మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్స్, ప్రాక్టికల్‌ల ఆధారంగా నిర్ణయిస్తారు.

టర్మ్-1లో ఏ విద్యార్థిని ఫెయిల్ లేదా పాస్ అని గుర్తించమని.. ఫైనల్ రిజల్ట్‌ వచ్చిన తర్వాత మాత్రమే మెరిట్ జాబితాను విడుదల చేస్తామని బోర్డు ఇప్పటికే పేర్కొంది. ఒక విద్యార్థి ఏదైనా ఒక పేపర్‌కు హాజరు కానట్లయితే.. ఆ విద్యార్థి గైర్హాజరు అయినట్లు మార్క్ చేస్తామని బోర్డు వివరించింది. ఫైనల్ రిజల్ట్‌ను పాఠశాల సబ్‌మిట్ చేసిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.