యాప్నగరం

AP RGUKT IIIT Admissions 2022 : ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్- 4 ఎంపికైన వారి జాబితా విడుదల.. PDF డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

RGUKT Admissions 2022 : ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి ఫేజ్-4 అర్హులైన అభ్యర్థుల జాబితా తాజాగా విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన వారు చెక్‌ చేసుకోవచ్చు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 24 Nov 2022, 2:08 pm
RGUKT AP 4th Phase Selection Merit List 2022 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ (RGUKT) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి ఫేజ్-4 అర్హులైన అభ్యర్థుల జాబితా తాజాగా విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 125 సీట్ల భర్తీకి నవంబరు 27న నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
Samayam Telugu RGUKT AP 4th Phase Selection List 2022


నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో జనరల్‌ కోటాలో 120, ఎన్‌సీసీలో 3, సీఏపీలో 1, ఓహెచ్‌ కోటా కింద 1 సీట్లు.. మూడు విడతల కౌన్సెలింగ్‌ అనంతరం 125 సీట్లు మిగిలిపోయాయన్నారు. ఎన్‌సీసీ, క్యాప్‌, ఓహెచ్‌ కోటా సీట్లు సైతం నవంబర్‌ 27నే భర్తీ చేస్తామన్నారు. క్యాంపస్‌ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు https://www.rgukt.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఫేజ్ 4 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను https://www.rgukt.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్- 4 ఎంపిక జాబితా ఇదే

P4_GN

AP Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 560 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
Anganwadi Supervisor posts : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ.. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 560 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీకానున్నాయి.

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో.. బుధవారం విచారణ కొనసాగగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఇదిలా ఉంటే.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఆమధ్య ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.