యాప్నగరం

RRB Secunderabad Group D Result 2022 : ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ సికింద్రాబాద్‌ జోన్‌ ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే

RRB Secunderabad : తాజాగా విడుదలైన ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ పరీక్షా ఫలితాల్లో.. సికింద్రాబాద్‌ జోన్‌ (RRB Secunderabad Group D Result 2022) నుంచి 24,596 మంది తర్వాతి పరీక్షలకు ఎంపికయ్యారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 23 Dec 2022, 10:17 am
RRB Group D Results 2022 : ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ ఫలితాలను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసింది. రైల్వే బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌, కోల్‌కతా, భోపాల్‌, గువాహటి జోన్ల ఫలితాలను ప్రకటించింది. మిగిలిన జోన్ల ఫలితాలు రావాల్సి ఉంది. సికింద్రాబాద్‌ జోన్‌ (RRB Secunderabad Group D Result 2022) నుంచి 24,596 మంది తర్వాతి పరీక్షలకు ఎంపికయ్యారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023, జనవరిలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు)కు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. పీఈటీ తేదీలను సంబంధిత ఆర్‌ఆర్‌బీలు త్వరలో వెల్లడించనున్నాయి. ఫలితాల కోసం అభ్యర్థులు https://rrbsecunderabad.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Samayam Telugu RRB Secunderabad Group D Result 2022


1,03,769 కొలువులకు నియామకాలు
RRB Group D నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా దశల వారీగా నిర్వహించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది. అక్టోబర్‌లో పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్‌ విడుదలయ్యాయి.

మూడు దశల్లో ఎంపికRRB Group D ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇది ఇప్పటికే పూర్తయింది. దీని తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు పీఈటీకి అర్హత సాధించాలంటే కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోరు సాధించాల్సి ఉంటుంది. అనంతరం వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.