ఏపీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష ఫలితాలను ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీట్రాన్స్కో) మే 29న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థి పేరు, హాల్టికెట్ నెంబర్, జోన్, పుట్టినతేదీ వివరాలతో ఫలితాలను ఏపీ ట్రాన్స్కో వెల్లడించింది. నియామక పరీక్షలో మొత్తం 13,181 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఏఈఈ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
సత్తాచాటిన విజయవాడ జోన్ అభ్యర్థులు..
నియామక పరీక్షలో మొత్తం 13,181 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాల్లో టాప్-10లో 7 స్థానాలను విజయవాడ జోన్కు చెందిన అభ్యర్థులే కైవసం చేసుకోవడం విశేషం. టాప్-5 స్థానాల్లో వీరే నిలిచారు. మిగతా స్థానాల్లో ఒకరు విశాఖపట్నం జోన్ అభ్యర్థి, ఒకరు కడప జోన్ అభ్యర్థి కాగా.. ఒకరు నాన్లోకల్ (అన్ని జోన్లు) అభ్యర్థి ఉన్నారు. ఫలితాల్లో 91 మార్కులతో దేవపూజ సుబ్రహ్మణ్యం మొదటిస్థానంలో నిలిచింది. ఇక కర్పూరపు ఆకాశ్ రెడ్డి 90 మార్కులతో, నట్టె మహిత 88 మార్కులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగో స్థానంలో పి.అవినాష్ (87), ఐదో స్థానంలో పి.శ్రీకాంత్ (87) నిలిచారు.
ఆంధ్రప్రదేశ్లో ఏపీలో మొత్తం 171 ఏఈఈ పోస్టుల భర్తీకి ఏపీ ట్రాన్స్కో మే 19న రాతపరీక్ష నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించింది. మొత్తం పోస్టులో విశాఖపట్నం జోన్ పరిధిలో 54 పోస్టులు, విజయవాడ జోన్ పరిధిలో 38 పోస్టులు, కడప జోన్లో 79 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ/ఎస్టీలకు 30%, దివ్యాంగులకు 30% గా నిర్ణయించారు.
వెబ్సైట్
సత్తాచాటిన విజయవాడ జోన్ అభ్యర్థులు..
నియామక పరీక్షలో మొత్తం 13,181 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాల్లో టాప్-10లో 7 స్థానాలను విజయవాడ జోన్కు చెందిన అభ్యర్థులే కైవసం చేసుకోవడం విశేషం. టాప్-5 స్థానాల్లో వీరే నిలిచారు. మిగతా స్థానాల్లో ఒకరు విశాఖపట్నం జోన్ అభ్యర్థి, ఒకరు కడప జోన్ అభ్యర్థి కాగా.. ఒకరు నాన్లోకల్ (అన్ని జోన్లు) అభ్యర్థి ఉన్నారు. ఫలితాల్లో 91 మార్కులతో దేవపూజ సుబ్రహ్మణ్యం మొదటిస్థానంలో నిలిచింది. ఇక కర్పూరపు ఆకాశ్ రెడ్డి 90 మార్కులతో, నట్టె మహిత 88 మార్కులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగో స్థానంలో పి.అవినాష్ (87), ఐదో స్థానంలో పి.శ్రీకాంత్ (87) నిలిచారు.
ఆంధ్రప్రదేశ్లో ఏపీలో మొత్తం 171 ఏఈఈ పోస్టుల భర్తీకి ఏపీ ట్రాన్స్కో మే 19న రాతపరీక్ష నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించింది. మొత్తం పోస్టులో విశాఖపట్నం జోన్ పరిధిలో 54 పోస్టులు, విజయవాడ జోన్ పరిధిలో 38 పోస్టులు, కడప జోన్లో 79 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ/ఎస్టీలకు 30%, దివ్యాంగులకు 30% గా నిర్ణయించారు.
వెబ్సైట్