యాప్నగరం

TS ECET Results: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ ఇలా చెక్‌ చేసుకోండి

Telangana TS ECET Result: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 12 Aug 2022, 12:31 pm
TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://ecet.tsche.ac.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈసెట్‌లో 90.69 శాతం శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాలిటెక్టిక్‌ డిప్లొమా అభ్యర్థులు బీటెక్‌, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 1న నిర్వహించిన ఈసెట్‌కుఈసెట్‌కు 22 వేల మంది హాజరవగా, 19,954 మంది ఉత్తీర్ణులయ్యారు.
Samayam Telugu TS ECET 2022 Results


TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET Results విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఈ ఏడాది ఎంసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. టాప్‌ ర్యాంక్‌లన్నీ అమ్మాయిలనే వరించాయి. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో లక్ష్మిసాయి లోహిత్‌ రెడ్డి (హైదరాబాద్‌) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా.. సాయి దీపిక సెకండ్‌ ర్యాంక్‌ (శ్రీకాకుళం), కార్తికేయ (గుంటూరు జిల్లా) మూడో ర్యాంక్‌ సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ నేహ (గుంటూరు), సెకండ్‌ ర్యాంక్‌ రోహిత్‌ విశాఖపట్నం, తరుణ్‌ కుమార్‌ (గుంటూరు)

ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు https://eamcet.tsche.ac.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ విభాగం పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్‌లో జ‌రిగాయి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.