యాప్నగరం

Manabadi TS SSC Supplementary Results: నేడే తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్‌ లింక్‌ ఇదే

TS 10th Supplementary Result 2022: తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 2న విడుదలకానున్నాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను https://www.bse.telangana.gov.in/ లో చూడవచ్చు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 2 Sep 2022, 7:51 am
TS SSC Supplementary Results 2022: తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 2న ఉదయం 11.30గంటలకు విడుదలకానున్నాయి. ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించిన పరీక్షలకు దాదాపు 55,662 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను https://www.bse.telangana.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Samayam Telugu TS SSC Supplementary Results


Hyderabad: హైదరాబాద్‌ అమ్మాయికి రూ.50 లక్షల స్కాలర్‌షిప్‌.. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ఏకైక అమ్మాయి..
Erasmus Mundus Sarena Scholarship 2022: హైదరాబాద్‌లో ఉంటున్న వరంగరల్‌కు చెందిన చలమల్ల ఇక్షిత ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AINST)లో న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లో బీటెక్‌ పూర్తి చేసింది.

రెండు సంవత్సరాల పీజీ కోర్సు చదివేందుకుగానూ రూ.50 లక్షల యూరోపియన్‌ కమిషన్‌ ఎరాస్మస్‌ మండస్‌ స్కాలర్‌షిప్‌ (Erasmus Mundus Sarena Scholarship 2022) 2022కు ఎంపికైంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఈ యేడాది ఎంపికైన ఏకైక విద్యార్ధిని ఇక్షిత కావడం విశేషం. ఈ సందర్భంగా ఓయూలోని పలువురు అధ్యాపకులు ఇక్షితను అభినందించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఇక్షితను సత్కరించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ఇక్షిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇక్షిత తండ్రి చలమల్ల వెంకటేశ్వర్లు ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.