యాప్నగరం

Prem Kumar: కూలీ కొడుక్కి రూ.2.5 కోట్ల స్కాలర్‌షిప్‌.. భారత్ నుంచి ఒకే ఒక్కడు.. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 6 మందిలో ఒకడు

Prem Kumar Scholarship of 2.5 Crore: ఓ విద్యార్థి ఏకంగా రూ. 2.5 కోట్ల స్కాలర్‌షిప్ సాధించాడు. ప్రతిభకు పేదరికం అడ్డంకాదని నిరూపించాడు. ఈ ఘనత సాధించిన భారత తొలి దళిత విద్యార్థిగా చరిత్రకెక్కాడు. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 13 Jul 2022, 10:50 pm
Samayam Telugu Prem Kumar Scholarship of 2.5 Crore
Prem Kumar Rs 2.5 cr scholarship to study in US: విదేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్ష ఉండి.. ఆర్థికస్థోమత సహకరించని చాలామంది పిల్లలు స్కాలర్‌షిప్ మీద ఆధారపడతారు. స్కాలర్‌షిప్‌ డబ్బుతోనే చదువుకొని ఉన్నతస్థానాలకు చేరుకుంటారు.. తమ లక్ష్యాలను అందుకుంటారు. అయితే ఆ స్కాలర్‌షిప్ దక్కించుకునే క్రమంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆయా కాలేజీలు, సంస్థలు ఇచ్చే స్కాలర్‌షిప్ కోసం వేల మంది దరఖాస్తు చేసుకుంటుంటారు. అందులో కొందరికే మాత్రమే అవకాశం లభిస్తుంది. అటువంటి అవకాశాన్ని దక్కించుకున్న ఓ విద్యార్థి ఏకంగా రూ. 2.5 కోట్ల స్కాలర్‌షిప్ సాధించాడు. ప్రతిభకు పేదరికం అడ్డంకాదని నిరూపించాడు. వివరాల్లోకెళ్తే..

బీహార్‌లోని గోన్‌పురా అనే చిన్న గ్రామానికి చెందిన రోజువారీ కూలీ కొడుకు ప్రేమ్ కుమార్ (Prem Kumar).. 12 ఏళ్ల క్రితమే అమ్మ చనిపోయింది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన, టాప్‌ 25 కాలేజీల్లో ఒకటైన లఫాయెట్ కాలేజీ నుండి 2.5 కోట్ల స్కాలర్‌షిప్ పొందాడు. గ్రాడ్యుయేషన్ డిగ్రీని అభ్యసించేందుకు ప్రేమ్ కుమార్‌కు రూ.2.5 కోట్ల స్కాలర్‌షిప్ ఇచ్చారు. ఈ ఘనత సాధించిన భారత తొలి దళిత విద్యార్థి ప్రేమ్.

Microsoft: ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన మైక్రోసాఫ్ట్‌.. 1800 మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు.. కారణమిదే..!
తన కుటుంబంలో కాలేజీకి వెళ్లిన మొదటి వ్యక్తి ప్రేమ్. ప్రస్తుతం శోషిత్ సమాధాన కేంద్రంలో 12వ తరగతి చదువుతున్నాడు. యూఎస్‌లో ప్రేమ్ మెకానికల్ ఇంజినీరింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై నాలుగేళ్లపాటు చదువుకుంటాడు. ఈ స్కాలర్‌షిప్ లో విద్య, చదువుకునే సమయంలో కావాల్సిన సదుపాయాలు, ప్రయాణించడానికి అయ్యే మొత్తం ఖర్చు, ట్యూషన్ ఫీజులు, ఆరోగ్య బీమా కవర్ చేయబడతాయి.

ప్రపంచం నలుమూలల నుండి మొత్తం 6 మంది విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ పొందారు. ఈ స్కాలర్‌షిప్ పేరు డయ్యర్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ కింద ప్రపంచంలోని కష్టతరమైన సమస్యలను పరిష్కరించడానికి అంతర్గత ప్రేరణ, నిబద్ధత ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ఇస్తారు. ప్రేమ్ తెలివి తేటలను, ప్రతిభను జాతీయ సంస్థ డెక్స్టెరిటీ గ్లోబల్ గుర్తించింది. ఆ సంస్థ అతనికి శిక్షణ ఇచ్చింది. డెక్స్టెరిటీ గ్లోబల్ అనేది దళిత పిల్లల కోసం పనిచేసే సంస్థ. ఇక.. ప్రేమ్‌ సాధించిన విజయంతో అతని కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.