యాప్నగరం

CBSE : అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌.. ఇలా అప్లయ్‌ చేసుకోవాలి.. ఈనెల 30 చివరితేది

CBSE Scholarship : సీబీఎస్‌ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ను ఏటా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాదికి సంబంధించిన స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు గడువును బోర్డు తాజాగా పొడిగించింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 18 Nov 2022, 11:03 am
CBSE Single Girl Child Scholarship 2022 : బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ను ఏటా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాదికి సంబంధించిన స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు గడువును బోర్డు తాజాగా పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ ద్వారా నవంబర్ 30 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. విద్యార్థుల అప్లికేషన్స్ వెరిఫై చేయడానికి స్కూళ్లకు డిసెంబర్ 12 వరకు సమయం ఉంది. గత ఏడాది ఈ స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థులు ఈ ఏడాదికి రెన్యూవల్ చేసుకోవడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తుది గడువును కూడా సీబీఎస్‌ఈ పొడిగించింది.
Samayam Telugu CBSE Single Girl Child Scholarship 2022


ఉండాల్సిన అర్హతలివే:
2021–2022 అకడమిక్ ఇయర్‌లో CBSE గుర్తింపు పొందిన స్కూళ్లలో 10వ తరగతి పూర్తి చేసి.. ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న సింగిల్ గర్ల్ స్టూడెంట్స్.. CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అమ్మాయి వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండాలి. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థిని ప్రస్తుతం చదువుతున్న పాఠశాల ట్యూషన్ ఫీజు నెలకు రూ.1,500 మించకూడదు. రాబోయే రెండేళ్లలో ట్యూషన్‌ ఫీజులో పెరుగుదల ప్రస్తుత మొత్తంలో 10% కంటే ఎక్కువ ఉండకూడదు. CBSE బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలలో NRI కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లయితే.. బోర్డ్ విధించిన షరతులను సంతృప్తి పరిస్తేనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారి స్కూల్ ట్యూషన్ ఫీజు నెలకు రూ.6,000 మించకూడదు. ఎంపికైన విద్యార్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 స్కాలర్‌షిప్ రూపంలో లభిస్తుంది.

ఇలా అప్లయ్‌ చేసుకోవాలి
మొదట విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ ఓపెన్ చేసి.. ‘Single girl child scholarship X-2022 REG’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫ్రెష్ లేదా రెన్యూవల్ కోసం అప్లికేషన్ ఎంపిక చేసుకోవాలి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.